బుల్లితెరపై వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ఇప్పుడు ఏడవ సీజన్ ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ కూడా చివరి దశకు చేరుకుంది. ఇక డిసెంబర్ 17వ తేదీన గ్రాండ్ ఫినాలే నిర్వహించబోతున్నారు. బిగ్బాస్ సీజన్ సెవెన్ ఉల్టా ఫుల్టా అంటూ వచ్చింది.ఇక ఈ సీజన్ లో అదిరిపోయే టాస్కులు, ఊహించని ట్విస్టులు, ఎమోషన్స్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మరో మూడు రోజుల్లో విన్నర్ ఎవరో తేలనుంది. ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు ఫైనలిస్టులు ఉన్నారు. శివాజీ , ప్రశాంత్, ప్రిన్స్ యావర్, అర్జున్ అంబటి, అమర్ దీప్ , ప్రియాంక .. ఈ కంటెస్టెంట్లకు వారి అభిమానుల నుంచి భారీగానే ఓటింగ్ లభిస్తుంది
ఇక డిసెంబర్ 17వ తేదీన గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్న నేపథ్యంలో ఎవరిని ముఖ్యఅతిథిగా తీసుకొస్తారనే విషయంలో కూడా ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ సీజన్ ఫినాలే ఈవెంట్ ను చాలా భారీగా ప్లాన్ చేయాలని నిర్ణయించింది స్టార్ మా.. అందులో భాగంగానే సెలబ్రిటీలతో పెర్ఫార్మెన్స్ చేయించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ గ్రాండ్ ఫినాలే సీజన్ కి చీఫ్ గెస్ట్ గా మహేష్ బాబు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత సీజన్ లలో రెండు సీజన్స్ కి గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి రాగా.. బిగ్ బాస్ 2 కి వెంకటేష్ గెస్ట్ గా వచ్చాడు. ఇప్పుడు తాజా సీజన్ కి మహేష్ బాబు రావడం దాదాపు ఫిక్స్ అయిందని తెలుస్తోంది. ఇకపోతే మహేష్ బాబు ఫినాలే కి వస్తున్నారు అంటే ఈ షో టిఆర్పి రేటింగ్ ఏ లెవెల్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేయబోతున్నారు. మహేష్ బాబు నటించిన ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. ఇందులో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.