Adivi sesh : పారితోషికం పెంచాడు

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ అంటే తెలియని వారు ఉండరు. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఇండస్ట్రీలోకి వచ్చిన అడివి శేష్ ఇప్పుడు టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే మేజర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో పెద్ద విజయం సాధించింది.

తాజాగా ఈ ఏడాది మళ్లీ హిట్ 2తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న హిట్ 2 వచ్చే నెల 2వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచింది. తాజాగా బుధవారం విడుదలైన ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను పెంచింది. సినిమాలో కేడీ పాత్ర చేస్తున్న అడివి శేష్ ఒక సైకో కిల్లర్ ను పట్టుకోవడానికి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఈ క్రమంలో ఎదురైన సమస్యలు ఈ సినిమాలో చూడొచ్చు.

ఇది ఇలా ఉండగా హిట్ 2 కోసం అడివి శేష్ తీసుకున్న రెమ్యునరేషన్ ఇదే అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మేజర్ కు రూ. 4 కోట్లు తీసుకున్న అడివి శేష్, ఇప్పుడు హిట్ 2 కోసం 5 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అడివి శేష్ హిట్ 3 లో కూడా కనిపించబోతున్న సంగతి విధితమే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు