Rashmika Mandanna : మళ్ళీ సందీప్ సినిమాలోనే..?

ఛలో సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా, మొదటి సినిమాతోనే యూత్ ను వలలో వేసుకుంది. గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న ఈ కన్నడ భామ, అతి తక్కవ కాలంలో స్టార్ డమ్ తెచ్చుకుంది. లేటెస్టు గా అల్లు అర్జున్ తో చేసిన పుష్ప మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి.

తమిళంలో విజయ్ దళపతి 66వ సినిమాతో పాటు, తెలుగులో పుష్ప ది రూల్, హిందీలో మిషన్ మజ్నూ, గుడ్ బై తో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ సరసన అనిమల్ సినిమాలో నటిస్తుంది. అనిమల్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇదిలా ఉండగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు చెందిన ఓ వార్త ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. రష్మిక మందన్నా ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో చేరబోతుందట. ఇప్పటికే దీని కోసం చర్చలు కూడా జరిగాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో స్పీరిట్ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇది వరకే అఫీషియల్ అనౌన్స్ కూడా వచ్చేసింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నాను ఎంపిక చేయబోతున్నారట.

అయితే రష్మిక మందన్నా ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి తాను డైరెక్షన్ చేయబోయే మూవీలో రష్మిక మరోసారి ఛాన్స్ ఇవ్వబోతున్నాడట సందీప్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు