AKHANDA : అఘోరా ఈజ్ బ్యాక్..?

సినిమాలకు సీక్వెల్ చేయడం ధైర్యంతో కూడిన పనే. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ అయితే గానీ, డైరెక్టర్లకు సీక్వెల్ ఆలోచన రాదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో సీక్వెల్ చేయడానికి డైరెక్టర్లు ఒకరిని మించి ఒకరు ముందుకు వస్తున్నారు. బాహుబలితో జక్కన్న, కేజీఎఫ్ తో ప్రశాంత్ నీల్, పుష్పతో సుకుమార్, ఎఫ్ 2, ఎఫ్ 3 అంటూ అనిల్ రావిపూడి ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పెంచుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సీక్వెల్ సినిమాలు ప్రేక్షకులను నిరాశపర్చలేదు.

దీంతో టాలీవుడ్ లో మరో సీక్వెల్ కు రంగం సిద్ధమైందని విశ్వసనీయ వర్గాల నుండి సమచారం. బాలయ్య – బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఇప్పటికే సింహా, లెంజెడ్ తర్వాత అఖండ సినిమాలు వచ్చి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. అఖండ, బాలయ్య కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. మాస్ ఎలివేషన్స్ పుష్కలంగా ఉండటంతో ఫ్యాన్స్ విపరీతంగా ఆదరించారు.

అయితే వీరి కాంబోలో నాలుగో మూవీ వస్తుందని గత కొద్ది రోజుల నుండి టాలీవుడ్ లో తెగ ప్రచారం సాగుతుంది. అఖండ సీక్వెలే ఈ నాలుగో మూవీని తెలుస్తుంది. ఇప్పటికే ఓ వేదికపై అఖండకు సీక్వెల్ ఉంటుందని బోయపాటి అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజా గా ఈ సీక్వెల్ కు స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో బోయపాటి శ్రీను ఉన్నట్టు తెలుస్తుంది. గోపిచంద్ మలినేని, అనిల్ రావిపూడి సినిమాల తర్వాత, బాలయ్య ఈ సీక్వెల్ ను సెట్స్ పైకి తీసుకెళ్తాడట.

- Advertisement -

సీక్వెల్ లో స్టోరీ.. అఘోరా తో ప్రత్యేక అనుబంధం ఏర్పరుచుకున్న పాప చుట్టూ ఉంటుందని టాక్. ఆ చిన్న పాప టీనేజ్ లోకి అడుగు పెట్టిన తర్వాత అనుకొని సమస్యలో ఇరుక్కుంటుందట. దీంతో ఆ పాపకు ఇచ్చిన మాట కోసం అఘోరా మళ్లీ రావడం తో సీక్వెల్ స్టార్ట్ అవుతుందని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది.

అఖండ కంటే, రెట్టింపు మాస్ ఎలివేషన్స్, సెంటిమెంట్ తో సీక్వెల్ రూపొందించడానికి బోయపాటి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు