Allu Arjun: ప్రభాస్‌ను దాటేశాడు..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దేశమంతటా భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇందుకు కారణం సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప సినిమా అని చెప్పవచ్చు. స్టార్ హీరోగా పుష్ప సినిమా రాకముందు వరకు తెలుగు మలయాళం లోనే ఒక వెలుగు వెలిగిన ఈయన ఈ సినిమా తర్వాత దేశవ్యాప్తంగా పేరుతో పాటు అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నుంచి పుష్ప-2 సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు.

ఇటీవల ఈ సినిమా షూటింగ్ కూడా చిత్రబృందం మొదలు పెట్టేసింది. అయితే తాజాగా బన్నీ టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటుడిగా నిలిచారు. బాహుబలి ప్రభాస్ ను అధిగమించిన బన్నీ ఈ అరుదైన ఘనత సాధించారు. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే మూవీకి ఐకాన్ స్టార్ భారీ మొత్తాన్ని అందుకొనున్నట్టు సమాచారం.

టి సిరీస్ ప్రొడక్షన్ నుంచి అల్లు అర్జున్ ఏకంగా రూ. 125 కోట్లు పారితోషకంగా రాబడుతున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని లేటెస్ట్ రిపోర్ట్. టి సిరీస్ బ్యానర్ పై సందీప్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్ లతో అల్లు అర్జున్ కలిసి పనిచేస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. వంగా సందీప్ రెడ్డి కాంబినేషన్ లో చిరకాలం గుర్తుండే సినిమా అందిస్తామని ఆశిస్తున్నట్టు అల్లు అర్జున్ ఇటీవల ట్వీట్ చేశారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు