Allu Arjun : కార్తిక్ ఆర్యన్ తో మల్టీస్టారర్..

పుష్ప చిత్రం తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్థాయి ప్రపంచ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 లో చేస్తున్నాడు. అయితే గత కొన్ని రోజుల ముందు.. అల్లు అర్జున్ తర్వాత సినిమా గురించి కొన్ని వార్తలు వచ్చాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో మూడో సినిమా రాబోతుందట. అది పుష్ప పార్ట్ 2 తర్వాత షూటింగ్ ప్రారంభమవుతుందని అప్పట్లో న్యూస్ వచ్చింది.

కాగా త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇప్పటి వరకు జులాయి, అలా వైకుంఠపూరములో.. సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్నిఅందుకున్నాయి. దీంతో ఈ కాంబినేషన్ మరోసారి సెట్ అవుతుందనే వార్తలు రావడంతో, అల్లు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోయారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరి కొన్ని వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ ఈ సినిమాలో కీలక పాత్ర చేయబోతున్నాడట. అల్లు అర్జున్, కార్తిక్ ఆర్యన్ లతో త్రివిక్రమ్ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. కాగా కార్తిక్ ఆర్యన్ ప్రస్తుతం బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అలా వైకుంఠపూరములో సినిమాను బాలీవుడ్ లో షెహజాదా అనే పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 10వ తేదీన విడుదల కానుంది. కాగా ఈ మల్టీస్టారర్ వార్తలలో ఎంత వరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు