Arvind Swamy : మరోసారి విలన్ పాత్ర..

ప్రముఖ కోలీవుడ్ నటుడు అరవింద్ స్వామి గురించి ఎంత చెప్పిన తక్కువే. సైడ్ పాత్రల నుంచి హీరో పాత్రలు చేసే వరకు ఎదిగాడు. ప్రస్తుతం హీరో క్యారెక్టర్స్ తో పాటు పవర్ ఫుల్ విలన్ పాత్రలు కూడా చేస్తున్నాడు. ఎక్కువగా తమిళ సినిమాలు చేసే అరవింద్ స్వామి.. అప్పుడప్పుడు మలయాళం, తెలుగులో కూడా సినిమాలు చేస్తున్నాడు. తెలుగు తెరపై మొదటి సారి 1995 లో మౌనం అనే సినిమాలో కనిపించాడు. తర్వాత ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ధ్రువ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్ర చేసి, తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు.

ఇదిలా ఉండగా ఎంతో స్పీడ్ గా ఉన్న అరవింద్ స్వామి కెరీర్ గతేడాది కాస్త నెమ్మదిగా సాగింది. 2022లో అరవింద్ స్వామి దాదాపు 5 సినిమాలకు సైన్ చేశాడు. అందులో కేవలం ఒక్క సినిమా మాత్రమే రిలీజ్ అయింది. అయితే ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో అరవింద్ స్వామి గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తర్వాత సినిమాలో అరవింద్ స్వామి విలన్ పాత్ర చేయబోతున్నారట. దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగిపోయినట్టు తెలుస్తోంది.

అజిత్ కుమార్ ప్రస్తుతం తునీవు తో సంక్రాంతి బరిలో ఉండబోతున్నారు. ఈ నెల 11న తునీవ్ విడుదల కానుంది. దీని తర్వాత విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో అజిత్ కుమార్ ఓ సినిమా చేయబోతున్నాడు. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. AK62 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే సెట్స్ పైకి రానుంది.

- Advertisement -

అయితే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం అరవింద్ స్వామిని మేకర్స్ ఫైనల్ చేశారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు