Buchi Babu : ఎట్టకేలకు సెకండ్ ప్రాజెక్ట్

ఆర్.ఆర్.ఆర్ సినిమా అఖండ విజయం సాధించడంతో పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు అగ్ర హీరో రామ్ చరణ్ తేజ్. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. RC15 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రం ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయకగా నటిస్తోంది.

ప్రస్తుతం రామ్ చరణ్ న్యూజిలాండ్ లో RC15 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఈ చిత్రం అనంతరం రామ్ చరణ్ చేయబోయే సినిమా ఏమిటన్నది అభిమానులలో ఉత్కంఠ గా మారింది. అయితే రామ్ చరణ్ ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయాల్సిన సినిమా అనివార్య కారణాల వల్ల రద్దు అయిన విషయం తెలిసిందే.

అయితే ఉప్పెన సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకున్న బుచ్చిబాబు ఈ సినిమాతోనే 100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టాడు. ఆ చిత్రం అనంతరం చాలా రోజులపాటు ఎన్టీఆర్ చుట్టూ తిరిగాడు. కానీ ఇప్పుడు అనూహ్యంగా రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. బుచ్చిబాబు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాకి రాంచరణ్ ఓకే చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఈ సినిమాని కొత్త బ్యానర్ లో సతీష్ కిలారు అనే వ్యక్తి నిర్మించనున్నట్లు టాక్ నడుస్తోంది. బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమాకు ఈ కొత్త బ్యానర్ 150 కోట్ల వరకు బడ్జెట్ పెట్టనుందని సమాచారం. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు