Tollywood: తెలుగు సినిమాల్లో బాలీవుడ్ భామలకు ఫుల్ డిమాండ్..

తెలుగులో స్టార్ హీరోయిన్లు చాలా తక్కువగా ఉంటారు. రోజుకో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్న ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకొని ఉండడం అంటే మాటలు కాదు. మరోవైపు పాన్ ఇండియా మార్కెట్ వచ్చింది కాబట్టి తెలుగు సినిమాల్లో నటించడానికి బాలీవుడ్ భామలు సైతం ఓకే అంటున్నారు. అంతేకాదు హీరోల కంటే మేమేం తక్కువ అంటున్నారు స్టార్ హీరోయిన్లు. వరుసగా రెండు మూడు సక్సెస్ లు కనిపిస్తే చాలు రేట్లు పెంచేస్తున్నారు.

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని చూస్తున్నారు. అందుకే అమాంతం రేట్లు పెంచేసి.. ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఇటీవల సౌత్ సినిమాలు వరుసగా నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సైతం తెలుగులో నటించడానికి సై అంటున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న “ఎన్టీఆర్ 30″ సినిమాలో అతిలోకసుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ మేరకు జాన్వి కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర నిర్మాణ సంస్థలు ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశాయి. అయితే ఈ చిత్రంలో నటించేందుకు జాన్వి ఏకంగా ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ” ప్రాజెక్ట్ కె”. ఈ చిత్రంలో దీపికా పదుకొన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

ఇక ఈ ముద్దుగుమ్మ “ప్రాజెక్టు కే” కోసం ఏకంగా 10 కోట్లు దాకా పారితోషికం అడిగిందట. ఇక శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న “RC 15” కోసం కియారా అద్వానీ మూడున్నర కోట్ల పారితోషకం తీసుకుంటుందట. బాలీవుడ్ హీరోయిన్లు నటిస్తున్న ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్లు అవుతాయో లేదో వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు