Sai Pallavi: భారీ ప్రాజెక్ట్‌లను రిజక్ట్ చేసిందా ?

టాలీవుడ్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రేమమ్ సినిమా ద్వారా మలయాళం ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఫిదా సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ మనసులను దోచుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకుంటూ లేడీ పవర్ స్టార్ అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ. పాత్రల ఎంపిక విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉండే సాయి పల్లవి తనకు కోట్ల రూపాయలు ఇచ్చిన సరే అడల్ట్ సినిమాలలో కాదు కదా కనీసం గ్లామర్ షో చేయడానికి కూడా ఆమె ఇష్టపడదు.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం తమిళంలో శివ కార్తికేయన్ సరసన నటిస్తున్న ఒక్క చిత్రం మాత్రమే సాయి పల్లవి చేతిలో ఉంది. కాగా ఇటీవల ఇద్దరు తమిళ స్టార్ హీరోల సరసన నటించే రెండు అవకాశాలను సాయి పల్లవి తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతుంది. ఇద్దరు ఎవరో కాదు నటుడు విజయ్, అజిత్ కావడం విశేషం. విజయ్ కథానాయకుడుగా నటించిన తాజా చిత్రం వారిసులో హీరోయిన్ గా ముందు సాయి పల్లవిని అనుకున్నారట. అయితే ఆ చిత్రంలో కథానాయక పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె నో చెప్పినట్లు సమాచారం.

ఆ తర్వాత నటి రష్మికను ఎంపిక చేశారు. ఆమె కూడా తన పాత్రకు ప్రాధాన్యత లేదని తెలిసిన విజయ్ సరసన నటించాలన్న కోరికతోనే వారిసు చిత్రంలో ఆమె నటించినట్లు చెప్పిన విషయం తెలిసిందే. సాయి పల్లవి నిరాకరించిన మరో చిత్రం వలిమై. అజిత్ కథానాయకుడుగా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు మొదట సాయి పల్లవిని అనుకున్నారట. అయితే ఆ పాత్రకు ప్రాముఖ్యత లేకపోవడంతో ఆమె నిరాకరించినట్లు సమాచారం.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు