సర్కారు వారి ఆశలకు గండి..!

సూపర్ స్టార్ మహేష్ బాబు రెండున్నర ఏళ్ల తర్వాత.. సిల్వర్ స్క్రీన్ పై కనిపించడానికి సర్వం సిద్ధం అయింది. ఆయన నటించిన సర్కారు వారి పాట మరో రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లల్లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నైజం ఏరియాలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది గంటల్లోనే 2.55 కోట్లు రాబట్టింది.

అంతా బాగానే ఉన్న సమయంలో సర్కారు వారి పాట టీంకు కొత్త తలనొప్పులు వచ్చి పడ్డాయి. మార్వెల్ మూవీ డాక్టర్ స్ట్రేంజ్.. సర్కారు వారి ఆశలకు గండి కొడుతుంది. నైజంలో ఏరియాలో ఎంతో కీలకమైన స్క్రీన్స్ అన్నీ కూడా రెండు వారాల పాటు డాక్టర్ స్ట్రేంజ్ కే బుక్ అయిపోయి ఉన్నాయి.

దీంతో.. క్రౌడ్ ఎక్కువ ఉండే స్క్రీన్స్ సర్కారు వారి పాటకు దక్కడం లేదు. దీని ప్రభావం మూవీ కలెక్షన్లపై చూపే ప్రమాదం ఉంటుందని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. అయితే మహేష్ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ వీలైనన్నీ ఎక్కువ స్క్రీన్స్ లో సినిమాను రిలీజ్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

- Advertisement -

ప్రస్తుతం థియేటర్స్ లో ఉన్న తెలుగు సినిమాలు ఇప్పటికే డాక్టర్ స్ట్రేంజ్ దెబ్బకు బలైపోయాయి. ఇప్పుడు ఈ మార్వెల్ మూవీ.. సూపర్ స్టార్ సర్కారు వారి పాట పై కూడా ప్రభావం చూపుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు