F3 : తెలివైన నిర్ణయం తీసుకున్న ‘ఎఫ్3’ టీం..!

ఈ మధ్య కాలంలో ప్రతి పెద్ద సినిమా రిలీజ్ అవుతున్న తరుణంలో టికెట్ రేట్లు హైక్ కోసం కొత్త జీవోల కోసం ప్రభుత్వాలకి రిక్వెస్ట్ లు పెట్టుకుంటున్నారు పెద్ద సినిమాల నిర్మాతలు. ప్రభుత్వాలు కూడా వారి రిక్వెస్ట్ ను చూసి యాక్సెప్ట్ చేస్తున్నాయి. కోవిడ్ కారణంగా వడ్డీలు ఎక్కువ కట్టాము అంటూ టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనాలు ఒక్క ‘ఆర్.ఆర్.ఆర్’ ‘కె.జి.ఎఫ్ 2’ లకి మాత్రమే ఎక్కువ టికెట్ రేట్లు పెట్టారు. మిగిలిన అన్ని సినిమాలను థియేటర్లలో చూడడానికి మొహం చాటేశారు. టాక్ ను బట్టి ఒటిటిల్లో చూసుకోవచ్చు అనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ‘రాధే శ్యామ్’ ‘ఆచార్య’ వంటి చిత్రాలు ధారుణ పరాజయానికి కారణం కూడా ఎక్కువ టికెట్ రేట్లు అనే చెప్పాలి. ‘సర్కారు వారి పాట’ ఓపెనింగ్స్ కూడా డల్ గా ఉండడానికి అదే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

అందుకే ‘ఎఫ్3’ టీం ఓ తెలివైన నిర్ణయం తీసుకుంది. 2022 ఫస్ట్ హాఫ్ కు అదే ఆఖరి పెద్ద సినిమా. కాబట్టి టికెట్ రేట్ల హైక్ ల కోసం ప్రయత్నించకుండా ఎప్పుడూ ఉండే టికెట్ రేట్లతోనే ఆ చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారు. ఈ విషయాన్ని త్వరలోనే మీడియాకి తెలియజేయనున్నారు దిల్ రాజు. మే 27న ‘ఎఫ్3’ విడుదల కానుంది.వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన మల్టీస్టారర్ ‘ఎఫ్2’ కి ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు