Power Star: వీరమల్లు లో కూడా గురూజీ ఇన్వాల్వ్ అవుతున్నాడా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు పవన్. సముద్రఖని డైరెక్షన్లో సాయిధరమ్ తేజ్ తో కలిసి బ్రో సినిమాను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్, సుజిత్ డైరెక్షన్లో ఓజీ, హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా, అప్పుడెప్పుడో క్రిష్ దర్శకత్వంలో మొదలైన హరిహర వీరమల్లు సినిమా పరిస్థితి మాత్రం ఒక అడుగు ముందుకేస్తే, నాలుగు అడుగులు వెనక్కి అన్న చందాన సాగుతోంది. ఈ సినిమా మొదలై చాలా కాలం అవుతున్నా  కూడా ఇప్ప్పటికీ చాలావరకు షూటింగ్ పెండింగ్ ఉందని సమాచారం అందుతోంది. కథ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా మార్పులు సజెస్ట్ చేశాడని, ఈ కారణంగా క్రిష్ కి, పవన్ కి విబేధాలొచ్చాయని కూడా రూమర్స్ ఉన్నాయి.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం వీరమల్లు సినిమాను రీషూట్ చేస్తున్నారని, అది కూడా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నేతృత్వంలో జరుగుతోందని వార్తలొస్తున్నాయి. ఇటీవల కాలంలో వచ్చిన ప్రతి పవన్ కళ్యాణ్ సినిమాలో ఇన్వాల్వ్ అయిన గురూజీ ఈ సినిమాలో కూడా ఇన్వాల్వ్ అవుతున్నదంటే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఒక పక్క పవన్ కళ్యాణ్ జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నాడన్న ఆనందంలో అభిమానులకు వీరమల్లు సినిమా పరిస్థితి తలచుకుంటే పంటి కింద రాయి పడ్డట్టు అవుతుంది. పవన్ కళ్యాణ్ తొలిసారి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమాతో మొదటి పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తాడని ఆశించిన ఎదురు చూపులు మిగుల్చుతొంది ఈ సినిమా.

వినిపిస్తున్న వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ, పవన్ ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల మీద పెట్టిన శ్రద్ధ వీరమల్లుపై పెట్టట్లేదన్నది మాత్రం స్పష్టం అవుతోంది. మరి, గురూజీ ప్రమేయంతో అయినా ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ అయ్యి, త్వరలోనే రిలీజ్ అవుతుందా లేదా చూడాలి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా జులై 28న రిలీజ్ కి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో మామ, అల్లుళ్ళు కలిసి నటించిన సినిమా ఏ మేరకు అలరిస్తుందో అన్న ఆసక్తి నెలకొంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు