విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని ఊపు మీదున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. విరూపాక్ష సినిమా తర్వాత మాస్ కథలకు ప్రిఫరెన్స్ ఇస్తున్న తేజ్ డైరెక్టర్ సంపత్ నందితో ఒక సినిమా కమిట్ అయ్యాడు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా టైటిల్, విషయంలో ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాకు ‘గాంజా శంకర్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఆ వార్తల సారాంశం. టైటిల్ లో చిరంజీవి అసలు పేరు ‘శంకర్’ ఉండటం , అదే పేరుతో చిరంజీవికి శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి బ్లాక్ బస్టర్ ఉండటం తేజ్ కలిసొచ్చే అంశం అని ఫ్యాన్స్ అంటున్నారు.
తేజ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కలిసి సముద్రఖని డైరెక్షన్లో బ్రో సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. విరూపాక్ష తర్వాత వస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. జులై 28న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన పవన్, తేజ్ లుక్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, విరూపాక్ష సినిమాలతో మోస్ట్ ప్రాఫిటబుల్ సినిమాల లిస్ట్ లో చేరిన మామ అల్లుళ్ళు ఇప్పుడు రీమేక్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం.
కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఫుల్ లెన్త్ మాస్ రోల్ లో నటించని తేజ్ సంపత్ నంది సినిమాలో మాస్ రోల్ లో కనిపించనున్నాడన్న వార్తతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. గాంజా శంకర్ అనే టైటిల్ ని కూడా ఛాంబర్లో రిజిస్టర్ చేయించినట్లు సమాచారం అందుతున్న నేపథ్యంలో త్వరలోనే ఈ టైటిల్ అనౌన్సమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి, మామ పేరుతో ఉన్న టైటిల్ తో వస్తున్న తేజ్ హిట్ అందుకుంటాడా లేదా అన్నది వేచి చూడాలి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News