Jahnvi Kapoor: ఎన్టీఆర్ ను మించిన స్టార్ తోనే చేస్తా..!

కొన్ని సంవత్సరాలు పాటు ప్రేక్షకులను అలరించారు నటి శ్రీదేవి.
అందానికి అసలైన అర్ధం ఆమె రూపం. తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికి వాడిపోని సిరిమల్లె పువ్వు ఆమె. ఆమె వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఆమె కుమార్తె జాహ్నవి కపూర్ “దడక్” సినిమాతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది.

ఇప్పటికి ఆమె నాలుగు సినిమాలకు పైగా చేసినా, ఏది ఆశించిన హిట్ అందుకోలేదు. కానీ తన అందాల అరబోతతో క్రేజ్ ను మాత్రం పెంచుకుంది. దీంతో కెరీర్ లో ఒక్క హిట్ లేని ఈ భామకు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ డైరెక్టర్లు నుండి బిగ్ ఆపర్లు వస్తున్నాయి. కానీ ఆమె మాత్రం ప్రస్తుతం తెలుగు ఆఫర్స్ ను రిజెక్ట్ చేస్తుంది.

ఆచార్య తర్వాత కొరటాల శివ, తారక్ తో ఎన్టీఆర్30 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుండి ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోతోనే సినిమాపై ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పెరిగింది. కాగ ఈ సినిమాలో హీరోయిన్ కోసం కొరటాల శివ సెర్చింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మొదట అలియ భట్ ను ఎంపిక చేయగా, పెళ్లి తర్వాత ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఆమె తర్వాత కొరటాల బాలీవుడ్ బ్యూటీలను సంప్రదిస్తూనే ఉన్నాడు.

- Advertisement -

అందులో భాగంగా ఈ అతిలోక సుందరి కూతురితో కొరటాల చర్చలు జరిపాడట. అయితే ఈ భామ శివ ఆఫర్ తిరస్కరించినట్టు బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. తారక్ కంటే, పెద్ద హిరోతోనే తాను సినిమాలు చేస్తానని చెప్పిందట. మినిమం పాన్ ఇండియా స్టార్ హీరోలతోనే స్క్రీన్ షేర్ చేసుకుంటానని తెల్చి చెప్పేసిందట. దీంతో చేసింది నాలుగు సినిమాలు, అందులోనూ హిట్ లేదు, అయినా జాహ్నవి కపూర్ కు డిమాండ్ బాగానే ఉందని సిని విశ్లేషకులు అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు