Sai Pallavi : బాలీవుడ్ బాట..

సాయి పల్లవి.. ఈ పేరు వినపడక చాలా రోజులు గడుస్తుంది. ఈ హైబ్రిడ్ పిల్ల చివరి సినిమా గార్గి. ఈ సినిమా పెద్ద విజయం సాధించలేదు. కానీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. సాయి పల్లవి నటనకు తమిళ, తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అలాగే విరాట పర్వం సినిమాకు కూడా సాయి పల్లవికి మంచి మార్కులు పడ్డాయి. పరిణితి చెందిన హీరోయిన్ అంటూ క్రిటిక్స్ కామెంట్స్ చేశారు. ప్రతి సన్నివేశాల్లో ఈ లేడీ పవర్ స్టార్ ఇచ్చిన హావాభావాలు ఏ ఇతర నటి కూడా చేయలేదు అంటూ కితాబు ఇచ్చారు. అయితే విరాటపర్వం ప్రేక్షకుల మనసులు గెలిచిందే కానీ, కమర్షియల్ గా హిట్ కాలేదు.

బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాల ఫలితాలు ఇలా రావడం నటన పరంగా సాయి పల్లవికి మంచి మైలేజ్ ఇచ్చాయి. కానీ ఈ రెండు సినిమాలు అవకాశాలను దెబ్బతీశాయా ? అంటే.. కొంత మంది నుంచి అవుననే సమాధానం వస్తుంది. దీనికి బలం చేకూరేలా గార్గి తర్వాత సాయి పల్లవి ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు. అయితే సాయి పల్లవి సినిమాలను ఎందుకు సైన్ చేయలేకపోవడానికి మరో కారణం ఉందని కొంత మంది. అంటున్నారు.

అదే.. కోయంబత్తూరులో తన చెల్లలు పూజా కన్నన్ తో కలిసి సాయి పల్లవి ఒక హాస్పిటల్ కట్టిస్తుంది. అది పూర్తి అయ్యే వరకు అక్కడే ఉంటుంది. అందుకే సాయి పల్లవి సినిమాలుకు దూరంగా ఉంటుందట. ఏది ఏమైనా ఈ లేడి పవర్ స్టార్ సినిమాల్లో కనిపించకపోవడం అభిమానులకు కొంత వరకు నిరాశగానే ఉంది. అయితే ప్రస్తుతం సాయి పల్లవి గురించి ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతుంది.

- Advertisement -

సాయి పల్లవి బాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతుందట. రణబీర్ కపూర్ తో కలిసి నటించడానికి రెడీ అవుతున్నట్టు టాక్. కాగా బాలీవుడ్ లో రూపొందుతున్న ఒక సినిమాలో రాముడి పాత్రను రణబీర్ కపూర్ చేస్తున్నాడు. సీత పాత్ర కోసం దీపికా పదుకొణె, కరీనా కపూర్ వంటి అగ్ర హీరోయిన్ల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. ఫైనల్ గా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవిని సీత పాత్ర కోసం ఫిక్స్ చేశారట. అతి త్వరలోనే సాయి పల్లవి విషయంతో పాటు ఈ ప్రాజెక్ట్ పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు