SSMB28: కన్ఫ్యూషన్‌లో మహేష్, త్రివిక్రమ్

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ SSMB28. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో మూడో సారి భారీ బడ్జెట్ సినిమా రాబోతుంది. హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పైన ఎస్. రాధాకృష్ణ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పూాజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా చేస్తుండగా, యంగ్ బ్యూటీ శ్రీలీల రెండో హీరోయిన్ గా నటిస్తుంది.

ఇప్పటికే ఈ కాంబినేషన్ లో అతడు, ఖలేజా లాంటి అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఫాన్స్ కి ఈ కాంబో చాలా ఫేవరేట్. థియేటర్ లో ఈ సినిమాలు మాములుగా ఆడిన టీవీల్లో మాత్రం ఎప్పటికప్పుడు TRP రేటింగ్స్ చాలా వస్తాయి. అలాంటి కాంబినేషన్ లో 13 ఏళ్ళ తర్వాత సినిమా వస్తుంది. ఎన్నో అవాంతరాల మధ్య షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం తుది దశకు చేరుకుంది.

అయితే ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ SSMB28 మూవీ రిలీజ్ డేట్ విషయంలో తెగ కన్ఫ్యూస్ అవుతున్నారట. మొదట సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో విడుదల చేయాలని త్రివిక్రమ్ భావించినట్టు వార్తలు వచ్చాయి. అప్పుడు కుదరదరని, వచ్చే ఏడాది సంక్రాంతికి షిఫ్ట్ చేస్తున్నట్టు కూడా గాసిప్స్ వచ్చాయి. కానీ, 2023లోనే ఎలాగైనా మూవీని పూర్తి చేసి, విడుదల చేయాలని మహేష్ బాబు అంటున్నట్టు తెలుస్తోంది. దీంతో కనీసం దసరాకు అయినా, డేట్ ఫిక్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

అయితే మహేష్ ఫ్యాన్స్ మాత్రం దసరాకు విడుదల చేయాలనే ఆలోచనను మార్చుకోవాలని త్రివిక్రమ్ ను కోరుతున్నారట. ఎందుకంటే, దసరాకు వచ్చిన మహేష్ బాబు సినిమాలు ఎప్పుడు కూడా పెద్దగా హిట్ కొట్టలేదు. దీంతో మరోసారి SSMB28 టీం మరోసారి డైలామోలో పడిపోయిందని తెలుస్తోంది. మరి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో చూడలి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు