Siddu Jonnalagadda : టిల్లును ఈ సమస్య వీడదా ?

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేసిన డీజే టిల్లు ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా వంశీ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. కేవలం రూ. 10 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడిన డీజే టిల్లు థియేటర్ లలో సుమారు రూ. 30 కోట్ల వరకు రాబట్టింది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని హీరో సిద్దు జొన్నలగడ్డ ప్రారంభంలోనే ప్రకటించారు.

ప్రస్తుతం డీజే టిల్లుకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే పేరుతో ఒక చిత్రం రూపొందుతుంది. దీనికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రం హీరోయిన్ల సమస్యను ఎదుర్కొంటుంది. ముందుగా టిల్లు 2 లో నేహా శెట్టిని తీసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల తర్వాత పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల పేరు వినిపించింది. ఫైనల్ గా అనుపమ పరమేశ్వరన్ ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ భామ కొన్ని రోజుల క్రితం టిల్లు2 నుంచి బయటకు వెళ్లిపోయింది.

దీంతో మరో హీరోయిన్ వేటలో పడింది టిల్లు 2 యూనిట్. అనుపమ తర్వాత మడోన్నా సెబాస్టియన్ ను సిద్దు జొన్నలగడ్డ ఫిక్స్ చేసినట్టు టాక్ వచ్చింది. తాజాగా టిల్లు2 హీరోయిన్ విషయంలో మరో న్యూస్ వైరల్ అవుతుంది. మడోన్నా సెబాస్టియన్ కూడా ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు సెట్ కాదని వెళ్లిపోయిందట. దీంతో మూవీ యూనిట్ హిట్2తో మంచి పేరు తెచ్చుకున్న మీనాక్షి చౌదరిని సంప్రదించరని సమాచారం. ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు