Samantha : మరింత సమయం?

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఇటీవల యశోద సినిమా హిట్ తో మంచి ఫామ్ లో ఉంది. యశోద హిట్ అయినా సామ్ అభిమానులకు కొంత వరకు నిరాశ ఉంది. దానికి కారణం ఆమెకు ఉన్న జబ్బు. యశోద రిలీజ్ కు ముందు తనకు మయోసైటిస్ అనే వ్యాధి ఉందని ప్రకటించిన విషయం తెలిసిందే. దీని తర్వాత ఈ స్టార్ హీరోయిన్ బయట ఎక్కువగా కనిపించడం లేదు. ట్రీట్ మెంట్ కోసం విదేశాలకు వెళ్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీని వల్ల ఈమె ఇప్పటి వరకు సైన్ చేసిన సినిమాలను పూర్తి చేయలేకపోతుంది.

అలా.. శివ నిర్వాణ దర్శకత్వంలో, విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న “ఖుషి” చిత్రం తాత్కాలికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీనిలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉండగా సమంతకు మయోసైటిస్ రాక ముందు బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసుకుంది.

బాలీవుడ్ డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే తో “సిటాడెల్” అనే వెబ్ సిరీస్ లో సమంత నటిస్తోంది. దీనిలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ గురించి చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. దీనిలో వరుణ్ ధావన్, సమంత నటిస్తున్నారని వెబ్ సిరీస్ యూనిట్ చాలా సార్లు ప్రకటించింది.

- Advertisement -

అయితే తాజాగా మంగళ వారం ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి టీం ఒక అప్డేట్ ఇచ్చింది. ఈ అప్డేట్ లో వరుణ్ ధావన్ పై షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నుంచి స్టార్ అవుతుందని ఉంది. అయితే ఇందులో సమంత గురించి ఎలాంటి సమచారం ఇవ్వలేదు. దీంతో “సిటాడెల్” లో సామ్ నటిస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అలాగే మయోసైటిస్ తర్వాత సామ్ కూడా బాలీవుడ్ ఎంట్రీకి మరింత సమయం తీసుకోవాలని భావిస్తుందట. అందువల్లే “సిటాడెల్” అప్డేట్ లో ఆమె పేరు లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు