Unstoppable with NBK : గ్రాఫ్ పెంచడమే లక్ష్యం

నందమూరి నటసింహం బాలయ్య చేస్తున్న రియాలిటీ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే. ఇప్పటికే తొలి సీజన్ పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో, ప్రస్తుతం రెండో సీజన్ ను జరుపుకుంటుంది. రెండో సీజన్ ను పవన్ కళ్యాణ్, చిరంజీవి వంటి భారీ నటులతో ప్రారంభించాలని ప్లాన్ చేశారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. అయినా రెండో సీజన్ ను బాలయ్య భారీగానే స్టార్ట్ చేశాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అతని కొడుకు లోకేష్ లు మొదటి ఎపిసోడ్ కు అతిథులుగా వచ్చారు.

ఈ మొదటి ఎపిసోడ్ కు మంచి ఆదరణ వచ్చింది. ఇక రెండో ఎపిసోడ్ లో కుర్ర హీరోలు, విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ వచ్చరు. మూడో ఎపిసోడ్ లో అడివి శేష్, శర్వానంద్ కనిపించారు. మొదటి ఎపిసోడ్ కంటే తర్వాత వచ్చిన రెండు ఎపిసోడ్ లు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి. దీంతో నాలుగో ఎపిసోడ్ తో మరోసారి ప్రేక్షకులను తమ వైపునకు తిప్పుకోవాలని బాలయ్య, అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు.

అందులో భాగంగా నాలుగో ఎపిసోడ్ కు అతిథులగా సీనియర్ హీరోయిన్ రాధికను తీసుకురానున్నట్టు సమాచారం. అలాగే మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ఆహ్వనించారట. అందుకు కిరణ్ కుమార్ కూడా పాజిటివ్ గానే స్పందింరారని సమాచారం అందుతుంది. దీంతో నాలుగో ఎపిసోడ్ ను అతి త్వరలోనే షూట్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. ఈ నాలుగో ఎపిసోడ్ తో అన్ స్టాపబుల్ గ్రాఫ్ మరోసారి పెరిగే ఛాన్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు