National Crush : బీ టౌన్ కి మకాం..

రష్మికా మందన్నాను తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఓన్ చేసుకున్నారో.. అందరికీ తెలుసు. ఈ బ్యూటీ నుంచి వచ్చే సినిమాలు అంటే మినిమం గ్యారంటీ ఉంటుంది. అందుకే దర్శక నిర్మాతలు ఈ ముద్దుగుమ్మను హీరోయిన్ గా ఎంపిక చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. రష్మికా తెలుగులో నటించిన మొదటి సినిమా “ఛలో” నుంచి ఇటీవల వచ్చిన “పుష్ప” వరకు అన్నీ కూడా తెలుగు ప్రేక్షకులను అలరించాయి.

తెలుగులో చివరగా ఈ బ్యూటీ “ఆడవాళ్లు మీకు జోహర్లు” అనే ఫ్యామిలీ డ్రామా సినిమాలో నటించింది. ఈ సినిమా అశించిన స్థాయిలో రాణించలేక పోయింది. అటు ఈ సినిమా హీరో శర్వానంద్ కు, ఇటు రష్మికా సినీ కెరీర్ లో ఒక ప్లాప్ గా ఈ సినిమా నిలిచింది. దీని తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో రష్మికా ఎక్కువగా కనిపించడం లేదు.

కొద్ది రోజుల్లోనే నేషనల్ క్రష్ అనే పేరు తెచ్చుకుని తెలుగు సినీ లవర్స్ కు అత్యంత చేరువైన రష్మికా, ప్రస్తుతం బాలీవుడ్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే బాలీవుడ్ లో గుడ్ బై, మిషన్ మజ్నూ, యానిమల్ సినిమాలకు సైన్ చేసింది. దీనిలో గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాల షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా, రణ్ వీర్ సింగ్ తో చేస్తున్న యానిమల్ షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది.

- Advertisement -

కాగా ప్రస్తుతం బీ టౌన్ లో వస్తున్న వార్తల ప్రకారం.. బాలీవుడ్ లో మరో సినిమా చేయడానికి నేషనల్ క్రష్ రష్మికా మందన్నా రెడీ అయినట్టు తెలుస్తోంది. హృదయాలను హత్తుకునే లవ్ స్టోరీలతో ఆషికి, ఆషికి-2 సినిమాలు బాలీవుడ్ లో వచ్చిన విషయం తెలిసిందే. దీనికి సీక్వెల్ గా ఆషికి-3 కూడా రాబోతుంది. ఈ సినిమాలో కార్తిక్ అర్యన్ హీరోగా నటిస్తున్నాడు. అయితే దీనిలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ ను ఎంపిక చేసినట్టు బీ టౌన్ సర్కిల్స్ లో టాక్.

ఈ టాక్ రావడానికి కారణం లేక పోలేదు. రష్మికతో కలిసి ఉన్న ఫోటోను కార్తిక్ అర్యన్ తన ఇన్ స్టాలో షేర్ చేశాడు. అంతే కాకుండా తాము కలిసి ఒక సినిమా చేస్తున్నట్టు కూడా ప్రకటించాడు. అయితే అది ఏ సినిమా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో వీళ్లు కలిసి నటించే సినిమా ఆషికి-3 అని నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు