Pawankalyan: నాగబాబు దగ్గర డబ్బులు తీసుకుంటున్న పవన్ కళ్యాణ్?

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా మెగా బ్రదర్ నాగబాబు బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నాదెండ్ల మనోహర్ తర్వాత పార్టీ అంతర్గత వ్యవహారాలన్నీ నాగబాబే చూసుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే తాజాగా జనసేన పార్టీకి నాగబాబు భారీ విరాళం అందజేశారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి 35 లక్షల రూపాయల చెక్ అందజేశారు.

అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు నిర్మించిన గుడుంబా శంకర్ సినిమా రీ రిలీజ్ ద్వారా సమకూరిన 35 లక్షలను జనసేన పార్టీకి మద్దతుగా అందజేశారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. “అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో రీ రిలీజ్ అయ్యే సినిమాల నుంచి వచ్చే ఆదాయంలో సింహ భాగం జనసేన పార్టీకి మద్దతుగా ఇవ్వడం ఆనందంగా ఉంది.

అంజన ప్రొడక్షన్స్ లో నిర్మాణమై రీ రిలీజ్ అవుతున్న సినిమాల ద్వారా వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం జనసేన పార్టీకి అందించాలని గతంలో నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే 35 లక్షల చెక్ అందించాం. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి కార్యక్రమాలకు ఈ మొత్తం ఉపయోగపడుతుంది” అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని జనసేన పార్టీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో వైరల్ గా మారింది.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు