Pawan Kalyan : ఆ ద‌ర్శ‌కుడితో

దర్శకుడు పరశురాం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యువత, ఆంజనేయులు, సోలో, సారొచ్చారు, శ్రీరస్తు శుభమస్తు లాంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్నాడు దర్శకుడు పరశురాం. ఇటీవల గీతాగోవిందం సినిమాతో ఒక్కసారిగా క్రేజీ దర్శకుడిగా మారారు. ఆ తరువాత ఈ ఏడాది మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమా చేసి మంచి హిట్ అందుకున్నారు. తాజాగా ఈ స్టార్ డైరెక్టర్ కు సంబంధించిన ఓ వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది.

అదేంటంటే పరశురాం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలసి ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. పవర్ స్టార్ తో కలిసి పనిచేయాలని చాలామంది నిర్మాతలు ఆశపడుతూ ఉంటారు. కానీ ఆయన అటు రాజకీయాలు, ఇటు సినిమాలు అంటూ చాలా బిజీగా గడుపుతున్నారు. ఆయన అంత బిజీగా ఉన్నా.. పరశురాంతో సినిమా తీసేందుకు ఓకే చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఓ సామాజిక ఇతివృత్తం నేపథ్యంలో పరశురాం కథ సిద్ధం చేస్తున్నట్లు.. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ క్రేజీ కాంబినేషన్ లో ఈ సినిమాని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 50 రోజులపాటు కాల్షీట్స్‌ ఇచ్చినట్లుు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తవగానే పరశురాం, పవన్ కళ్యాణ్ ను కలిసి ఆ కథను వినిపించడానికి రెడీతున్నారని ఫిలింనగర్ సర్కిల్ టాక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు