Prabhas: ఈ సారి పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్

ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ప్రభాస్ తన స్వయం కృషితో స్టార్ హీరో స్థాయికి వెళ్లి ప్రేక్షకుల తో డార్లింగ్ అని ప్రేమగా పిలిపించుకునే ఫ్యాన్ ఫాలోయింగ్ ని క్రియేట్ చేసుకున్నాడు. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన బాహుబలి సినిమా తరువాత వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో దేశవ్యాప్త క్రేజ్‌ను, మార్కెట్‌ని పెంచుకుని టాలీవుడ్ లో మొదటి పాన్ ఇండియా స్టార్‌గా నిలిచాడు.

తాజాగా ప్రభాస్ పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఓం రౌత్ దర్శకత్వంలో రాబోతున్న ఆది పురుష్ ను అంతర్జాతీయంగా విడుదల చేయాలని మూవీ టీం ప్లాన్ చేస్తున్నారట. తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కె ను కూడా అంతర్జాతీయ మార్కెట్ పై ఫోకస్ చేస్తూ విడుదల చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే సలార్ ను కూడా వరల్డ్ వైడ్ గా విడుదల చేయాలని నిర్మాణ సంస్థ హంబోలే ఫిల్మ్స్ కూడా నిర్ణయం తీసుకున్నట్టు టాక్.

ఆది పురుష్, ప్రాజెక్ట్ కె తో పాటు సలార్ ముందుగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు గానే అనౌన్స్ చేశారు. కానీ, ప్రస్తుతం కాలంలో సౌత్ సినిమాలకు అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్న డిమాండ్ నేపథ్యంలో పాన్ వరల్డ్ సినిమాల్లా మారుస్తున్నారు. రామాయణం అధారిత కథతో సాగుతున్న ‘ఆదిపురుష’ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న రా అండ్ మోటైన యాక్షన్, అడ్వెంచర్, థ్రిల్లర్ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ అగ్ర నటి శ్రుతి హాసన్ నటిస్తోంది.

- Advertisement -

పాన్ ఇండియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రభాస్ ఇప్పుడు పాన్ వరల్డ్ స్థాయిలో కూడా రానిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ వరుస అంతర్జాతీయ సినిమాల తర్వాత ప్రభాస్ కెరీర్ మరో రేంజ్ కు వెళ్లడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు