Rajinikanth : క్రేజీ కాంబో

దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఒక‌ప్పుడు సూప‌ర్ హిట్ సినిమాల‌ను అందించిన ఈ ద‌ర్శ‌కుడు ఈ మ‌ధ్యకాలంలో కొన్ని సినిమాలు ఆశించినంత మేర‌కు ఆక‌ట్టుకోలేదు. చాలా రోజుల త‌రువాత తాజాగా పొన్నియిన్ సెల్వ‌న్ రూపంలో భారీ విజ‌యాన్ని అందుకున్నాడు మ‌ణిరత్నం. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సీక్వెల్‌ను తెరకెక్కించే ప‌నిలో బిజీగా ఉన్నారు.

మ‌ణిర‌త్నం, ర‌జినికాంత్ కాంబోలో ఓ సినిమా రాబోతుంద‌ని త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలో ఓ వార్త తాజాగా చ‌క్క‌ర్లు కొడుతుంది. ర‌జినీ ప్ర‌స్తుతం లైకా ప్రొడ‌క్ష‌న్స్ లో రెండు సినిమాల్లో న‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం. చక్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో ఒక‌టి తెర‌కెక్కుతుండ‌గా.. మ‌రో చిత్రానికి మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ట్టు స‌మాచారం. పొన్నియిన్ సెల్వ‌న్ 2 చిత్రం పూర్తి కాగానే ర‌జినీ చిత్రాన్ని ప్రారంభించ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది.

ఇక ఇదిలా ఉంటే.. మ‌ణిర‌త్నం, ర‌జినీకాంత్ కాంబోలో వ‌చ్చిన ‘ద‌ళ‌ప‌తి’ ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. 1991లో వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు భారీ విజ‌యం సాధించింది. దాదాపు 31 ఏళ్ల త‌రువాత వీరి కాంబినేష‌న్‌లో సినిమా రానుంద‌నే వార్త ఇప్పుడు అంద‌రిలో ఎంతో ఆస‌క్తిని పెంచేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు