Rashmika Mandanna: నేషనల్ క్రష్ మరో ఛాన్స్ కొట్టేసింది

ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది హీరోయిన్లు గా పరిచయమయ్యారు. పరిచయమైన హీరోయిన్స్ లో చాలామంది నిలద్రొక్కుకుని సక్సెసఫుల్ గా వాళ్ళ కెరియర్ ను సాగిస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో కృతి శెట్టి, శ్రీ లీల, నేహశెట్టి, కేతిక శర్మ వంటి హీరోయిన్స్ తెలుగులో మంచి అవకాశాలను అందుకుంటున్నారు. ఛలో సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ అయింది రష్మిక.

ఈ భామ తక్కువ టైంలోనే మంచి హిట్స్ సాధించి ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకుంది. ఛలో సినిమా తర్వాత చేసిన గీత గోవిందం సినిమా మంచి హిట్ అయింది. ఆ తర్వాత చేసిన డియర్ కామ్రేడ్ సినిమా అంతంత మాత్రమే ఆడినా, సూపర్ స్టార్ మహేష్ సరసన ఛాన్స్ కొట్టి సరిలేరు నీకెవ్వరూ సినిమాతో మంచి హిట్ అందుకుంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ సరసన “అనిమల్” సినిమాలో నటిస్తోంది.

తాజాగా మరో బాలీవుడ్ ఛాన్స్ ను దక్కించుకుంది ఈ భామ. షాహిద్ కపూర్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో విక్రమార్కుడు 2 సినిమాను చేయనున్నారు. ఈ సినిమాను సంజయ్ లీల భన్సాలీ నిర్మించనున్నారు. ఈ సినిమాలో రష్మిక కథనాయికగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు