Rashmika : చైతన్యతో మొదటిసారి

అక్కినేని నాగ చైతన్య హీరోగా థాంక్యూ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందకు వచ్చిన సంగతి విధితమే. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో, దిల్ రాజ్ ప్రొడక్షన్ లో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలైంది. కానీ జూలై నెలలో వచ్చిన అన్ని సినిమాలాగే థాంక్యూ సినిమా కూడా పరాజయాన్నే చూసింది. థాంక్యూ ఫలితాన్ని పక్కకు పెట్టిన చైతన్య, ప్రస్తుతం బాలీవుడ్ లో వస్తున్న లాల్ సింగ్ చడ్డా పై దృష్టి పెట్టాడు.

అమీర్ ఖాన్ హీరోగా వస్తున్న లాల్ సింగ్ చడ్డాలో చై కీలక పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ చిత్రం విడుదల కాకుముందే చైతన్య మరో సినిమాకు సిద్దమైపోయాడు. నాగ చైతన్య తర్వాత సినిమా పరశురామ్ తో ఉంది. పరుశురామ్ ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేశాడు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లాడానికి ప్రయత్నిస్తున్నాడు.

దీనికి ముందు సినిమాలో నటీనటుల ఎంపికకు కసరత్తు చేస్తున్నాడు పరశురామ్. ఈ చిత్రంలో కథనాయకిగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా ను పరశురామ్ ఎంపిక చేసినట్టు సమాచారం అందుతుంది. రష్మికతో పరశురామ్ ఇప్పటికే చర్చలు కూడా జరిపినట్లు టాక్ వినిపిస్తుంది. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందం చిత్రంలో రష్మిక హీరోయిన్ గా చేసింది. ఇప్పుడు ఈ సినిమాలో కూడా చేసేందుకు రష్మిక ఒప్పుకుందని సమాచారం అందుతుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు