Rashmika Mandanna : లక్కి ఛాన్స్

ప్రస్తుత కాలంలో హీరోయిన్లు ఒక్క భాషకే పరిమితం అవడం లేదు. ఒక భాషలో క్రేజ్ వచ్చిందంటే.. ఇతర భాషల్లో కూడా ఛాన్స్ లను దక్కించుకుంటున్నారు. బాలీవుడ్ వరకు కూడా వెళ్తున్నారు. ఇలా మంచి క్రేజ్ సంపాదించుకున్న వాళ్లల్లో రష్మిక మందన్నా ఒకరు. ఈ కన్నడ భామ ముందుగా శాండిల్ వుడ్ లో కిర్రాక్ పార్టీ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మరో రెండు సినిమాలు కన్నడలో చేసిన తర్వాత టాలీవుడ్ లోకి ఛలో అనే సినిమాతో అడుగుపెట్టింది. ఈ సినిమాలో రష్మిక అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు వచ్చాయి.

ఇటు తెలుగు, అటు కన్నడ ను మేనేజ్ చేస్తూ.. కార్తీ తో సుల్తాన్ అనే సినిమాతో కోలీవుడ్ లోకి కూడా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ వరకు కూడా వెళ్లింది. అయితే కోలీవుడ్ లో నేషనల్ క్రష్ నటించిన సుల్తాన్ సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఆ సమయంలో రష్మికను కోలీవుడ్ ఆడియన్స్ దారుణంగా ట్రోల్స్ చేశారు. రష్మిక వల్లే తమ అభిమాన హీరో కార్తీ నటించిన సుల్తాన్ ప్లాప్ అయింది అంటూ నెగిటివ్ గా ట్రోల్ చేశారు. దీంతో ఈ నేషనల్ క్రష్ కు కోలీవుడ్ ఛాన్స్ రావడం చాలా కష్టమే అనుకున్నారు.

అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో, కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న ఒక వార్త ను చూస్తే.. నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. అదేంటంటే.. కోలీవుడ్ స్టార్ కార్తీ ప్రస్తుతం సర్ధార్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దీని తర్వాత రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ ఓ సినిమా చేయబోతున్నాడు. దీనికి జపాన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఎస్ఆర్ ప్రభు ఈ సినిమాను నిర్మించనున్నారు. అక్టోబర్ ఆఖరి వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

కోలీవుడ్ లో మొదటి సినిమాతోనే ప్లాపును మూటగట్టుకున్న ఈ భామ, మరోసారి తమిళ ఇండస్ట్రీలో కనిపించదు అనుకున్నారు. కానీ.. అదే సుల్తాన్ హీరో కార్తీతో రెండోసారి జతకట్టబోతుందని టాక్. ఈ వార్త నిజమే అయితే.. కోలీవుడ్ లో తన సత్తా చాటడానికి రష్మికా మందన్నాకు లక్కీ ఛాన్స్ వచ్చిందనే చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు