RC16 : జగదేక వీరుడు అతిలోక సుందరిని గుర్తు చేస్తారా ?

శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ లో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ తనకంటూ స్పెషల్ క్రేజ్ ని సంపాదించుకుంది. మరాఠి సినిమా ‘సైరాట్’ హిందీ రీమేక్ ‘ధడక్’ తో ఇండస్ట్రీలోకి అడుగు పెటింది. మొదట తడబడినా తరువాత సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఫ్యాన్స్ ను తన వైపు తిప్పుకుంది. దీని తర్వాత వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. జాన్వీకి తెలుగు సినిమాలో నటించాలని ఉంది అంటూ ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలో పేర్కొంది.

అయితే ఈ బాలీవుడ్ బ్యూటీ మనసు ప్రస్తుతం ఒక టాలీవుడ్ సినిమాపై పడిందని తెలుస్తోంది. మొదటి సినిమా తోనే 100కోట్ల క్లబ్ లో చేరిన ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమాను అనౌన్స్ చేశాడు. బుచ్చిబాబు ముందుగా ఒక స్టోరీని NTR కోసం అనుకున్నాడు. కానీ, కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. దీంతో అదే స్టోరీతో రామ్ చరణ్ తో బుచ్చిబాబు సినిమా చేస్తున్నాడు.

అయితే ఈ సినిమాలో హీరయిన్ ఎవరు అన్న దానిపై ఇప్పటి నుంచే ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ పేరు వినిపిస్తుంది. జాన్వీ కపూర్‌ని ప్రధాన పాత్రలో నటింపజేసే ప్లాన్‌ తో బుచ్చిబాబు ఉన్నారని సినీ వర్గాలు టాక్. ఒక వేళ రామ్ చరణ్ సినిమాలో జాన్వీ కపూర్ ఫైనల్ అయితే వీరి జోడీ ఆసక్తికరంగా ఉంటుందని సినీ లవర్స్ అంటున్నారు.

- Advertisement -

కాగా జాన్వీ కపూర్ తల్లి శ్రీ దేవీ, రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఎవర్ గ్రీన్ మూవీ వచ్చి 30 ఏళ్లు పూర్తీ చేసుకున్నా ఇంకా క్రేజ్ తగ్గలేదు. ఈ హిట్ కాంబినేషన్ వారసులుగా ఉన్న వీరు, జత కడితే.. మళ్లీ చిరు-శ్రీదేవీని చూడొచ్చని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఇది జరుగుతుందో లేదో చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు