కేజీఎఫ్-2 ఎఫెక్ట్ : రిలీజ్ డేట్స్ మార్చుకున్న సుమ‌, విశ్వ‌క్ సేన్

రాకింగ్ స్టార్ య‌ష్ కేజీఎఫ్ -2 ఏప్రిల్ 14న ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ ల‌లో విడుద‌ల అయిన విష‌యం తెలిసిందే. విడుద‌ల అయిన నాటి నుంచి దేశం మొత్తం కేజీఎఫ్ మేనియా న‌డుస్తుంది. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా ప్రేక్షకులు థియేట‌ర్ల‌కు క్యూ క‌డుతున్నారు. దీంతో య‌ష్.. ఇండియ‌న్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. త‌మిళ స్టార్ హీరో ద‌ళ‌పతి విజ‌య్ బీస్ట్ తో పాటు మ‌రి కొన్ని సినిమాలు కూడా కేజీఎఫ్ సునామీలో గ‌ల్లంత‌య్యాయి. నాలుగు రోజుల్లో రూ. 546 కోట్ల గ్రాస్ సాధించి ద‌మ్ములేపుతుంది. బాలీవుడ్ లోనూ కేజీఎఫ్ -2 హ‌వా న‌డుస్తుంది. ఈ నాలుగు రోజుల్లో అక్క‌డ‌ రూ. 200 కోట్లను వ‌సూల్ చేసింది. అతి త్వ‌ర‌లోనే వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 1,000 కోట్ల మార్క్ ను అందుకోవ‌డానికి అడుగులు వేస్తుంది.

కాగ కేజీఎఫ్‌-2 ను త‌ట్టుకోవ‌డం క‌ష్టమ‌ని ప‌లు సినిమాలు వాయిదా ప‌డుతున్నాయి. బుల్లితెరలో త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్న‌ యాంక‌ర్ సుమ లీడ్ రోల్ లో న‌టిస్తున్న సినిమా జ‌య‌మ్మ పంచాయ‌తీ. ఈ సినిమాను డైరెక్ట‌ర్ క‌లివ‌ర‌పు విజ‌య్ కుమార్ తెర‌కెక్కిస్తున్నాడు. అయితే ఈ ముందుగా ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం ఈ సినిమా ఏప్రిల్ 22 రిలీజ్ కావాల్సింది. కానీ థీయేట‌ర్స్ ల‌లో కేజీఎఫ్-2 ర‌చ్చ ఇంకా త‌గ్గ‌లేదు. దీంతో మే 6 వ తేదీన విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం ఫిక్స్ అయింది.

అలాగే యంగ్ హీరో విశ్వ‌క్ సేన్.. అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం సినిమాతో వ‌స్తున్నాడు. అయితే ఈ సినిమా ఏప్రిల్ 22న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ఫ‌స్ట్ అనౌన్స్ చేశారు. ఇది కూడా కేజీఎఫ్ పోటీలో నిల‌వలేక మే 6కి వాయిదా పడింది. అయితే మ‌రో కుర్ర హీరో నాగ శౌర్య మాత్రం త‌గ్గేదేలా అంటూ.. ఏప్రిల్ 22 తేదీనే కృష్ణ వింద విహారీ తో థీయేట‌ర్స్ లోకి వ‌స్తున్నాడు. అయితే నాగ శౌర్య.. య‌ష్ ధాటికి త‌ట్టుకుని నిల‌బ‌డుతాడో లేదో చూడాలి మ‌రి

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు