Sai Pallavi : హీరోయిన్ సమస్య తీరిందా..?

ఆచార్య డిజాస్టార్ తర్వాత కొరటాల తన తర్వాతి సినిమాలపై ఫోకస్ పెట్టాడు. స్టార్ ఇమేజ్ ఉన్న డైరెక్టర్, తొలిసారి ఆచార్య మూవీతో ఈ ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయింది. దీంతో తన పరువును తిరిగి సంపాదించుకోనే పనిలో పడ్డారు. ప్రస్తుతం కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.

ఇటీవల తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుండి ఓ వీడియోను సైతం రిలీజ్ చేశారు. ఈ వీడియోతో కొరటాల-ఎన్టీఆర్ మూవీపై అంచనాలు భారీగానే పెరిగాయి. అయితే ఈ సినిమాకు హీరోయిన్ల సమస్య ఏర్పడింది. తొలుత బాలీవుడ్ క్వీన్ అలియా భట్ ను అనుకున్నారు. అలియా కూడా కొరటాల సినిమాలో నటిస్తున్నట్టు అనౌన్స్ చేసింది. కానీ, ఆమె తన ప్రియుడు రణ్ బీర్ కపూర్ తో పెళ్లి పీటలు ఎక్కింది. పెళ్లి తర్వాత పర్సనల్ లైఫ్ కు టైమ్ ఇస్తానని, ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది అలియా.

అలియా తర్వాత బాలీవుడ్ భామలు దీపికా పడుకొనె, జాన్వీ కపూర్ తో చర్చలు జరిపినట్టు సమాాచారం. కానీ వీరు ఈ ప్రాజెక్ట్ లో నటించడానికి అంగీకరించకపోవడంతో, కొరటాల టాలీవుడ్ పై ఫోకస్ పెట్టారట. ప్రస్తుతం లేడీ పవన్ కళ్యాణ్ గా పేరున్న సాయి పల్లవితో కొరటాల చర్చలు జరిపారని, స్టోరీ నచ్చడంతో ఈ మూవీలో నటించడానికి సాయి పల్లవి అంగీకరించిందని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.

- Advertisement -

దీని పై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారం. అయితే పోయిన పరువు తిరిగి రావాలంటే తప్పక హిట్ కావాల్సిన సినిమాలో లేడీ పవన్ కళ్యాణ్ నటించడం కొరటాలకు కాస్త కలిసొచ్చే అంశమని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు