SSMB28 : బాలీవుడ్ కు రీచ్ అయ్యేలా..

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ 11 ఏళ్ల తర్వాత మళ్లీ సెట్ అవుతున్న విషయం తెలిసిందే. SSMB28 తో ఈ క్రేజీ కాంబో రాబోతుంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. అయితే మహేష్ సూచన మేరకు త్రివిక్రమ్ స్టోరీ మార్చారని, కొత్త కథతో SSMB28 త్వరలోనే స్టార్ట్ కాబోతుందని టాక్. ముందుగా ఈ సినిమాలో మహేష్ విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ ఉండబోతున్నాడని వార్తలు వచ్చాయి.

కానీ త్రివిక్రమ్ స్టోరీ మార్చడంతో కథ పరంగా పృథ్వీరాజ్ ను కూడా మార్చారని సమాచారం. ఈయన స్థానంలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ను విలన్ పాత్ర కోసం తీసుకున్నారని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. తాజాగా మహేష్ బాబును ఢీ కొట్టే విలన్ పాత్రకు సంబంధించి మరో వార్త వినిపిస్తుంది. అదేంటంటే.. ? బాలీవుడ్ పవర్ ఫుల్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర చేయబోతున్నారట.

ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్ తో మూవీ మేకర్స్ సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టు తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ అయితే తెలుగుతో పాటు సౌత్, హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంటాడు. ముఖ్యంగా హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో ఈయనకు ఉన్న క్రేజ్ సినిమాకు ప్లస్ అవుతుంది. అందుకే సైఫ్ ను ఎంపికచేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట. ఒక వేళ సైఫ్ అలీ ఖాన్ SSMB28 లో ఫిక్స్ అయితే, ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు పెరగడం ఖాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు