Samantha : బాలీవుడ్ కు మకాం మార్చేసిందా ?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిన సమంతకు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. సాఫ్ట్ లవ్ స్టోరీస్ నుంచి పవర్ ఫుల్ కారక్టర్స్ వరకు అన్నిటిలో తనదైన గుర్తింపు తెచ్చుకుంది సమంత. ఇటీవల పుష్ప సినిమాలో ”ఊ ఉంటావా మావ ఊఉ అంటావా” అనే స్పెషల్ సాంగ్ లో స్టెప్స్ వేసి కుర్రాళ్ళని ఓ ఆట ఆడుకుంది ఈ భామ.

అయితే అనారోగ్యం కారణంగా కెరీర్ లో చిన్న బ్రేక్ తీసుకున్న సమంత పూర్తిగా కోలుకొని మళ్లీ సెట్స్ లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. వరుస సినిమాలు, రిలీజ్ లు అంటూ బిజీ గా ఉన్న ఈ ముందుగుమ్మ ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్స్ తో పాటు తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ లపై ఫోకస్ పెడుతుంది.

ఇక ఈ స్టార్ హీరోయిన్ బాలీవుడ్ లో అడుగు పెట్టడానికి సర్వం సిద్ధం చేసుకుంది. ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ లో సమంత నటిస్తుంది. అలాగే వరుణ్ ధావన్ కూడా కీలక పాత్రలో చేస్తున్నాడు. దీనితో పాటు బాలీవుడ్ లో మరో ప్రాజెక్ట్ కు సామ్ సైన్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖుర్హానా హీరోగా చేయబోతున్నట్టు టాక్.

- Advertisement -

బాలీవుడ్ పై సామ్ ఫోకస్ చేస్తున్న క్రమంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న ఒక న్యూస్ వైరల్ అవుతుంది. సమంత ముంబైకి మకాం మార్చడానికి సిద్ధమైందట. అందు కోసం ముంబైలో ఓ ఖరీదైన ఇల్లును కూడా కొనుగోలు చేసిందని బీ టౌన్ కోడై కూస్తోంది. ముంబైలోనే సెటిలై.. ఇటు టాలవుడ్ లో.. అటు బాలీవుడ్ లో సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తుందట.

ముంబైలో సామ్ రిలాక్స్ గా ఉండేలా.. తన ఇల్లు సముద్రం ఒడ్డున ఉండేలా ప్లాన్ చేసిందట. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ వార్తలతో.. టాలీవుడ్ ఒక్క సారిగా ఉలిక్కిపడింది. ఇప్పుడే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, వరుస సినిమాలు సైన్ చేస్తూ ఉంది సమంత. ఈ సమయంలో ఇల్లు కొనింది అంటే , ముంబై లోనే సెటిల్ అవ్వబోతుందా? టాలీవుడ్ ని వదిలేసి బాలీవుడ్ కి వెళ్లిపోతుందా? అసలు సమంత ఎం ఆలోచిస్తుంది ? ఇంకా తిరిగి తెలుగు సినిమాల వైపు రాదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు