Sanjay Dutt : టాలీవుడ్ పై గురి..

బాలీవుడ్ లో అగ్ర నటుల్లో సంజయ్ దత్ ముందు వరుసలో ఉంటారు. సంజయ్ 1971లోనే సిల్వర్ స్క్రిన్ పై చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. పదేళ్ల తర్వాత రాఖీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ తనదైన మార్క్ వేసుకున్నాడు. తన కెరీర్ లో చాలా ఒడిదుడుకలను ఎదుర్కొన్నా.. బాలీవుడ్ స్టార్ ట్యాగ్ మాత్రం తగ్గిపోలేదు. 2020లో ఈ అగ్ర నటుడు ఊపిరితిత్తుల క్యాన్సర్ బారీన కూడా పడ్డాడు.

దీని తర్వాత సంజయ్ దత్ సినిమాలు చేయకపోవచ్చు అంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ క్యాన్సర్ ను విజయవంతంగా ఎదుర్కొని వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ జోషలో ఉన్నాడు. ఇప్పటికే దత్ కేజీఎఫ్ 2 లో నెగిటివ్ రోల్ చేసి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. కేజీఎఫ్ 2 కి ముందు సంజయ్ నెగిటివ్ రోల్ చేశాడు. కానీ ఈ సినిమాతో సంజయ్ దత్ కెరీర్ మలుపు తిరిగింది. దీని తర్వాతే దత్ కు విలన్ పాత్రలు ఎక్కువగా వస్తున్నాయి.

ఈ క్రమంలో సౌత్ తో పాటు టాలీవుడ్ పై సంజయ్ దత్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ తాత పాత్రలో ఈ సీనియర్ నటుడు కనిపించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మరో సౌత్ సినిమాకు కూడా సంజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్ లో వస్తున్న తెలుగు, తమిళం, హిందీ భాషల సినిమాలో విలన్ పాత్రకు సంజయ్ ను ఫిక్స్ చేసినట్టు టాక్.

- Advertisement -

టాలీవుడ్ నుంచి డైరెక్టర్ శేఖర్ కమ్ముల, కోలీవుడ్ నుంచి ధనుష్ ఉన్న నేపథ్యంలో బాలీవుడ్ నుంచి స్టార్ నటుడ్ని తీసుకోవాలని మేకర్స్ భావించారట. అందులో భాగంగానే సంజయ్ దత్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలనే అధికారిక ప్రకటన రానుందని ప్రచారం సాగుతుంది.

దీంతో సౌత్ లో మరో రెండు సినిమాల్లో నటించడానికి సంజయ్ దత్ చర్చలు నడుస్తున్నట్టు గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇందులో ఓ తెలుగు మూవీ కూడా ఉందని టాక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు