ప్రిన్స్ మహేష్ బాబు సిల్వర్ స్క్రీన్ పై కనిపించక దాదాపు రెండేళ్లు అవుతుంది. భారత్ అనే నేను, మహర్షీ, సరిలేరు నీకేవ్వరు తో హ్యాట్రిక్ హిట్ కొట్టిన ప్రిన్స్.. నాలుగో సినిమాగా సర్కారు వారి పాట చేస్తున్నారు. 2020లో లాంచ్ అయిన ఈ సినిమాను పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. రూ. 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్, జి. మహేష్ బాబు ఎంటర్టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ సినిమాలో ప్రిన్స్ మహేష్కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. అలాగే కీలక పాత్రల్లో సముద్ర ఖని, వెన్నెల కిషోర్, సుబ్బ రాజు కనిపించబోతున్నారు. కాగ రెండేళ్ల క్రితమే ప్రారంభం అయిన ఈ సినిమా కరోనా మహమ్మారి వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. సర్కారు వారి పాటను ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది.
దీంతో మే 12 వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అధికారిక ప్రకటన చేశారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సారి కూడా సర్కారు వారి పాట సినిమా వాయిదా పడబోతుందని తెలుస్తుంది. స్క్రీప్ట్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని.. దీని కోసం మహేశ్ బాబు స్వయంగా రంగంలోకి దిగి సరి చేస్తున్నారట.
అన్ని సమస్యలను ఫిక్స్ చేసి జూన్ మొదటి వారం గానీ, రెండో వారంలో గానీ విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తుందట. కాగ జూన్ 11 వ తేదీన విడుదల కాబోయే నేచురల్ స్టార్ నాని అంటే సుందరానికి సినిమాకు పోటీగా సర్కారు వారి పాట రానుందని సమాచారం. దీని పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. కాగ ఈ సినిమాతో మహేష్ మరో హిట్ కొడుతాడో చూడాలి మరి.