Sarkaru Vaari Paata : ‘సర్కారు వారి పాట’ ని ఆ స్టార్ హీరో మిస్ చేసుకున్నాడా?

మహేష్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని పరశురామ్ దర్శకత్వం వహించాడు. తొలి రోజు మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ రన్ ను బాగానే కొనసాగిస్తుంది. మొదటి వారం ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.80 కోట్లకి పైగా షేర్ ను నమోదు చేసింది. సమ్మర్ హాలిడేస్ ఈ చిత్రానికి బాగా కలిసొచ్చాయి. అప్పు అనే యూనివర్సల్ కాన్సెప్ట్ తో రూపొందిన చిత్రం కాబట్టి.. ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.

అయితే కథ కంటే కూడా మహేష్ పాత్ర వల్లే ఈ చిత్రం నిలబడుతుంది అనే విశ్లేషకులు కూడా లేకపోలేదు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ మహేష్ బాబు కాదట. ఓ స్టార్ హీరో మరియు అతని తమ్ముడు వద్దనుకుంటే ఈ కథ మహేష్ వరకు వచ్చిందట.

వివరాల్లోకి వెళితే..దర్శకుడు పరశురామ్ ‘గీతా ఆర్ట్స్’ కాంపౌండ్లో చాలా కాలం పనిచేశాడు. శిరీష్ తో ‘శ్రీరస్తు శుభమస్తు’ అనే చిత్రాన్ని తీసి హిట్టు కొట్టాడు కూడా. కొన్ని కథలు రెడీ చేసుకుని అల్లు అర్జున్ కు వినిపించాడు. అందులో ‘సర్కారు వారి పాట’ కథ కూడా ఉంది. బన్నీకి ఈ కథ నచ్చింది. కానీ ఇది నేను చేస్తే బాగోదు అని అన్నాడట. అల్లు అరవింద్ కు వినిపించగా సెకండ్ హాఫ్ బాగా రాలేదని చెప్పినట్టు తెలుస్తుంది.

- Advertisement -

కనీసం శిరీష్ అయినా ఒప్పుకుంటాడేమో అన్ని ప్రయత్నిస్తే అతను ఈ కథ వద్దు అని మొహం మీదే చెప్పేసినట్టు తెలుస్తుంది. అందుకే ‘గీతా’ కాంపౌండ్ నుండీ బయటకి వచ్చేసి ముందు మహేష్ కు వినిపించాడు. మహేష్ కూడా మొదట ఓకె చెప్పలేదు. దాంతో ఈ కథని పక్కన పెట్టేసి నాగ చైతన్యతో సినిమా మొదలుపెట్టాడు. అది సెట్స్ కు వెళ్లే టైములో మహేష్ పిలిచి కొన్ని మార్పులు చేస్తే ఈ కథ ఫైనల్ చేస్తాను అని చెప్పాడట. ఆ మార్పులు ఏంటో తెలీదు కానీ మహేష్ మాత్రం కథని ఫైనల్ చేసాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు