Shraddha Kapoor : మరో బయోపిక్ కు సై

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఇప్పటికే భేడియా సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తుంది. అయితే శ్రద్ధా కపూర్ మరో సినిమాకు సైన్ చేసినట్టు సమాచారం అందుతుంది. ఆ చిత్రం బయోపిక్ అని బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ బాలీవుడ్ బ్యూటీ గతంలో కూడా బయోపిక్ లు చేసింది. ఈమె 2017 అపూర్వ లఖియా దర్శకత్వంలో హసీనా పార్కర్ అనే చిత్రంలో నటించింది.

హసీనా పార్కర్ అంటే ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది దావుడ్ ఇబ్రహీం సోదరి. హసీనా పార్కర్ పాత్రలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది శ్రద్దా. తాజాగా ఈమె మరో బయోపిక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. ఉగ్రవాదులను ఒంటరిగా ఎదుర్కొని మట్టుబెట్టిన ఒక సాధారణ యువతి పాత్రలో ఈమె కనిపించబోతున్నట్టు టాక్. 2009లో కాశ్మీర్ నగరంలో ఉగ్రవాదులు ఒక ఇంటిలోకి చోరబడితే.. ఆ ఇంట్లో ఉన్న యువతి ఉగ్రవాదులను ఎదుర్కొవడమే కాకుండా.. ఓ ఉగ్రవాదిని కూడా చంపేసింది.

ఆ యువతి ధైర్య సాహాసాలకు అప్పట్లో దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందాయి. ఇప్పుడ ఆ యువతి పాత్రను శ్రద్ధా కపూర్ చేయబోతుందని సమాచారం. అయితే ఈ చిత్రానికి దర్శకుడు, నిర్మాత ఎవరు? వంటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే అధికారిక ప్రకటనతో ముందుకు రానుందని తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు