SSMB29 : షూరునే కాలేదు.. అప్పుడే..

సినిమా ఇండస్ట్రీలో పుకార్లు రావడం సాధారణం. అవి వైరల్ అవడం కూడా సర్వ సాధారణం. ఒక చిన్న పాయింట్ తీసుకుని, దాంతో పదుల సంఖ్యలో రూమర్స్ ను క్రియేట్ చేస్తారు. అలా వచ్చే రూమర్స్ కూడా అంతే స్పీడ్ గా వైరల్ అవుతాయి. అది నిజమో.. కాదో.. విషయాలను పక్కనబెట్టి ఆ రూమర్స్ ను షేర్ చేస్తారు. ప్రస్తుతం ప్రతి సినిమా విషయంలో ఇలాంటి పుకార్లు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి.

ఇలాంటి పుకార్లు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు కూడా బాగానే వస్తున్నాయి. ఇప్పటి వరకు SSMB28 మూవీపై ఇలాంటి వార్తలు వచ్చాయి. అయితే SSMB28 షూటింగ్ ఇటీవల స్టార్ట్ కావడంతో నెటిజన్ల చూపు SSMB29 పై పడింది. దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో SSMB29 వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇటీవల పలువురు హాలీవుడ్ నటీనటులు ఈ సినిమాలో నటిస్తారని రూమర్స్ వచ్చాయి. తాజాగా బాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొనె హీరోయిన్ గా చేస్తుందని ఒక పుకారు తెగ హల్ చల్ చేస్తుంది. దీపికను ఇప్పటికే రాజమౌళి కలిశాడని, స్టోరీ నచ్చడంతో ఈ భారీ ప్రాజెక్ట్ చేయడానికి దీపిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఈ వార్తల్లో సారాశం. అయితే ఈ సినిమాకు ఇప్పటి వరకు పూర్తి స్టోరీనే ఫిక్స్ కాలేదు. అప్పుడు నటీ నటుల గురించి వార్తలు రావడం నిజాంగానే కాసింత ఆశ్చర్యంగా ఉంది.

- Advertisement -

కాగా దీనికి ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నాడు. SSMB29 స్టోరీపై ఇటీవల ఆయన ఒక హింట్ కూడా ఇచ్చాడు. నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా సినిమా ఉంటుందని చెప్పాడు. గ్లోబెట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ గా ఉంటుందని కూడా చెప్పుకొచ్చాడు. SSMB29 కి సంబంధించి విజయేంద్ర ప్రసాద్ చెప్పిన ఈ విషయం మినహా.. ఇప్పటి వరకు ఒక్క న్యూస్ కూడా రాలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు