టాలీవుడ్ లో హీరోలు పాన్ ఇండియా ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. అగ్ర హీరోల నుంచి యంగ్ హీరోల వరకు పాన్ ఇండియా మార్కెట్ వైపే మొగ్గు చూపుతున్నారు. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా.. డైరెక్టర్లు కూడా ఆ లెవల్ లోనే స్టోరీలను సిద్ధం చేస్తున్నారు. నిర్మాతలు సైతం పాన్ ఇండియా అంటే.. కోట్లు కుమ్మరించడానికి వెనకాడటం లేదు. పుష్ప, ఆర్ఆర్ఆర్ తెలుగు సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ముందు కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దీంతో చేసే సినిమాలనే పాన్ ఇండియా సినిమాలు గా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం ఇతర భాషాల్లో స్టార్ డమ్ ఉన్న నటీ నటులను కూడా ఎంపిక చేస్తున్నారు.
కాగ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్లు గా ఫేమ్ అయిన ప్రభాస్, అల్లు అర్జున్ అన్ని భాషాల్లో సినిమాలు చేస్తున్నారు. అలాగే హరి హర వీర మల్లు సినిమాతో పవన్ కళ్యాణ్, లైగర్ తో విజయ్ దేవరకొండ, మేజర్ తో అడవి శేషు పాన్ ఇండియా మార్కెట్ పై దండయాత్ర చేయడానికి రెడీగా ఉన్నారు. వీరి బాటలోనే యంగ్ హీరోలు కూడా అడుగులు వేయనున్నట్టు ఇటీవల ప్రకటనలు చేశారు.
నేచురల్ స్టార్ నాని దసర యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. శ్రీకాంత్ ఓదల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. అలాగే యంగ్ హీరో నిఖిల్ స్పై సినిమాతో ఈ మార్కెట్ లో లక్ ను పరీక్షించెకోడానికి రెడీ అవుతున్నాడు. ఈ కుర్ర హీరోల సినిమాలు మరి పాన్ ఇండియా మార్కెట్ పై ఎంత వరకు ప్రభావం చూపిస్తాయా వేచి చూడాలి మరి.