Trinadha Rao Nakkina : మైత్రీ నుంచి పిలుపు

రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా వచ్చిన తాజా చిత్రం ధమాకా. త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ రచయితగా ఉన్నాడు. భారీ అంచనాలతో ధమాకా డిసెంబర్ 23న థియేటర్ లలో రిలీజ్ అయింది. సినిమాకు మొదట మిశ్రమ టాక్ వచ్చింది. కానీ తర్వాత రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను రాబట్టి దూసుకెళ్తుంది. తాజాగా శుక్రవారం ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది.

క్రాక్ తర్వాత రవితేజ నుంచి వచ్చిన రెండు సినిమాలు కూడా ఫ్లాప్ కావడంతో రవితేజ, ఆయన ఫ్యాన్స్ దీనిపై భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. రవితేజ ఈ సారి హిట్ కొట్టడం పక్క అని మాస్ మహారాజా ఫ్యాన్స్ గట్టిగా నమ్మారు. ఈ నమ్మకాన్ని డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన నిలబెట్టాడు. రవితేజకు మంచి హిట్ ను ధమాకాతో ఇచ్చాడు. దీంతో డైరెక్టర్ త్రినాథ నక్కిన వైపు అందరి చూపులు వెళ్తున్నాయి. ఈ డైరెక్టర్ తో సినిమా చేస్తే.. హిట్ పక్క అని నిర్మాతలు నమ్ముతున్నారు.

తాజాగా ఈ డైరెక్టర్ గురించి టాలీవుడ్ వర్గాల్లో ఒక వార్త వినిపిస్తోంది. త్రినాథ రావు నక్కినతో టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ చర్చలు జరుపుతున్నారట. త్వరలోనే ఈ డైరెక్టర్ తో మైత్రి వాళ్లు ఓ సినిమా చేయబోతున్నారట. దానికి సంబంధించిన అడ్వాన్స్ కూడా ఇచ్చారని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు