Prabhas: ఆదిపురుష్ కి అప్పుడు మైనస్ అయ్యిందే ఇప్పుడు ప్లస్ అవుతుందా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా రూపొందిన ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. అయితే, గతంలో టీజర్ లో నాసిరకం విఎఫెక్స్ తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సినిమా యూనిట్ ట్రైలర్ తో అన్ని విమర్శలకు చెక్ పెట్టి సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో, టీజర్ విషయంలో వచ్చిన విమర్శలను పట్టించుకోకుండా ఈ సినిమాను అప్పుడే రిలీజ్ చేసి ఉంటే గనక ప్రభాస్ కి మరొక డిజాస్టర్ వచ్చి ఉండేదని, సినిమా యూనిట్ జాగ్రత్త పడటం మంచిదే అయిందని ఫ్యాన్స్ అంటున్నారు.

ఆ రకంగా గతంలో వచ్చిన విమర్శలే ఇప్పుడు ఆదిపురుష్ రేంజ్ ని పెంచాయన్నమాట. ఆదిపురుష్ సినిమా బిజినెస్ పరంగా కూడా అటు ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది. దేశవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగిన ఆదిపురుష్ కి ఓపెనింగ్స్ ఫస్ట్ డే ఓపెనింగ్స్  100కోట్లు కచ్చితంగా వస్తాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.

సాహో, రాధే శ్యామ్ లాంటి డిజాస్టర్స్ తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న సినిమా కావటంతో ఆదిపురుష్ హిట్ అవ్వటం తప్పనిసరిగా మారింది. రామ్ చరణ్ సరసన కృతి సనన్ సీత పాత్రలో నటించిన ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది.  సమ్మర్లో సరైన హిట్ లేక బోసిపోయిన బాక్సాఫీస్ వద్ద ఆదిపురుష్ బ్లాక్ బస్టర్ అయ్యి సందడి తెస్తుందా లేదా అన్నడి వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు