ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆత్మహత్యకు ముందు చైతన్య సెల్ఫీ వీడియో అందరిని కదిలిస్తోంది. అతని ఆత్మహత్యకు అప్పులు కారణం అని తెలుస్తున్నప్పటికీ పరోక్ష కారణం వేరే ఉందని అనిపిస్తుంది. నిజానికి మల్లెమాల సంస్థ నిర్వహించే జబర్దస్త్, ఢీ వంటి షోల ద్వారా చాలా మంది ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్ వెలుగులోకి వచ్చారు. ఆ షోల ద్వారా వచ్చిన క్రేజ్ తో ఎంతో మంది ఆస్తులు సంపాదించుకొని స్థిరపడ్డారు. కానీ, ఒక కొరియోగ్రాఫర్ అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. సెల్ఫీ వీడియోలో చైతన్య జబర్దస్త్ ద్వారా డబ్బు వస్తుంది, ఢీ ద్వారా అంత డబ్బు రాదని చెప్పటం ఇందుకు కారణం.
చైతన్య సెల్ఫీ వీడియో చూసిన నెటిజన్స్ మల్లెమాల సంస్థ గురించి పలు సంచలన కామెంట్స్ చేస్తున్నారు. మల్లెమాల షోలలో పని చేసే ఆర్టిస్టులకు రెమ్యునరేషన్స్ ఎక్కువగా ఉండవని, అక్కడ ఆర్టిస్టులకు తగిన గౌరవం ఉండదని అంటున్నారు. పంచ్ ప్రసాద్ అనారోగ్యం పాలై హాస్పిటల్ లో ఉన్నప్పుడు తోటి ఆర్టిస్టులు, స్నేహితులు నుంచి సాయం అందిందే తప్ప, మల్లెమాల యాజమాన్యం నుండి సాయం అందలేదని అంటున్నారు. మల్లెమాల యాజమాన్యానికి కళాకారుల పట్ల కనీస గౌరవం కూడా ఉండదని అంటున్నారు.గతంలో కమెడియన్ కిరాక్ ఆర్ఫీ మల్లెమాలలో నాసిరకం భోజనం గురించి చేసిన కామెంట్స్ ని కూడా గుర్తు చేస్తున్నారు.
చైతన్య అప్పుల పాలు అవటానికి కారణం మల్లెమాల తక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడమే అని అంటున్నారు. జబర్దస్త్ ఆర్టిస్టులకు కూడా పేమెంట్స్ చాలా తక్కువ అని వినికిడి ఉంది. కాకపోతే ఆ షో ద్వారా వచ్చిన క్రేజ్ తో బయట ప్రోగ్రామ్స్ చేసుకుంటూ తద్వారా వచ్చిన డబ్బులతో స్థిరపడుతున్నారు. కానీ, కొరియోగ్రాఫర్స్ అందరికి అలాంటి అవకాశం ఉండదు. పండు, యష్ మాస్టర్ లాంటి ఒకరిద్దరికి తప్ప పెద్దగా ఫేమ్ రాలేదు. ఏది ఏమైనా కొరియోగ్రాఫర్ చైతన్య మరణం బుల్లితెర కళాకారుల మనసుల్లో విషాదం నింపటంతో పాటు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో చైతన్య ఆత్మహత్య లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మల్లెమాల యాజమాన్యం కళాకారుల సంక్షేమం కోసం ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News