Puri-Chiru : ఇప్పుడైనా ఇంప్రెస్ చేస్తాడా ?

టాలీవుడ్ లో మాస్ అండ్ ఎనర్జిటిక్ డైరెక్టర్ లలో పూరి జగన్నాథ్ ముందు వరసలో ఉంటారు. ఈయన ఇప్పటి వరకు చేసిన సినిమాలు మాస్ ప్రేక్షకులకు కిక్ ఇచ్చేలా ఉన్నాయి. ఈ మాస్ డైరెక్టర్ భారీ అంచనాలతో ఈ మధ్య విజయ్ దేవరకొండతో లైగర్ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం దారుణమైన అపజయాన్ని మూటగట్టుకుంది. పూరి కెరీర్ లో కొన్ని డిజాస్టర్ లు ఉన్నాయి. కానీ లైగర్ ప్రభావం వాటి కంటే ఎక్కువగా ఉంది.

లైగర్ డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. వీటి నుంచి బయట పడాలంటే ఒక బ్లాక్ బస్టర్ హిట్ తప్పనిసరి. దీంతో టాలీవుడ్ మాస్ హీరోలకు కథలు చెబుతున్నాడని ఈ మధ్య కాలంలో టాక్ వస్తోంది. మాస్ మహారాజా రవితేజ కు పూరి ఒక కథ చెప్పాడని ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఒక లైన్ చెప్పాడట. పూరి చెప్పిన లైన్ కు చిరు ఇంప్రెస్ అయ్యారని తెలుస్తోంది.

వెంటనే ఫుల్ స్క్రిప్ట్ తీసుకురమ్మని చిరంజీవి చెప్పాడట. దీంతో పూరి ప్రస్తుతం చిరు కోసం ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడని సమాచారం. అయితే మెగాస్టార్ తో పూరి సినిమా ఇది వరకే రావాల్సింది. చిరు 150వ చిత్రంగా పూరి దర్శకత్వంలో ఆటో జాని అని అనౌన్స్ చేశారు. కానీ చిరుకు ఫుల్ స్క్రిప్ట్ పెద్దగా నచ్చకపోవడంతో వి వి వినాయక్ తో ఖైదీ నెం 150 ని చేశారు. అయితే చిరుతో సినిమా చేయాలని పూరి అప్పటి నుంచే ప్రయాత్నలు చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఫుల్ స్క్రిప్ట్ తో చిరు ను మెప్పించి కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేస్తాడా లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు