Kriti Sanon: దానికంటే ఇవే ఎక్కువ గుర్తుంటాయి

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన నటి కృతిసనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనొక్కడినే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఈ సినిమా హిట్ కాకపోవటంతో తెలుగులో సరైన అవకాశాలు లభించలేదు. దీంతో ఈ అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితం అయింది. బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.

ఇక ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేసేంత జోరు మీదుంది ఈ బాలీవుడ్ భామ కృతి. ఇటివలె వరుణ్ ధావన్ తో కలిసి ‘బేడియా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ నాయిక, ప్రస్తుతం ‘షెహజాదా, గణపథ్’ చిత్రాల వరుస రిలీజ్ లతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నది. ఆమె కెరీర్ లో మరో ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కుతున్నది ఆది పురుష్. ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 16న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించారు.

రామాయణ ఇతిహాస నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాఘవుడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్ కనిపించనున్నారు. ఈ చిత్రంలోని విజువల్ ఎఫెక్ట్ లపై తాజాగా కృతి స్పందించింది. ఆమె మాట్లాడుతూ, ‘చదివిన దానికంటే చూసి తెలుసుకున్నవే ఎక్కువ గుర్తుంటాయి. ఈ విజువల్ మెమోరీ మరింత అందంగా ఉండాలంటే సినిమా ఒక మ్యాజిక్ ల అనిపించా.లి రామాయణం మనకు ఎప్పటినుంచో తెలిసిన కథ. అయితే దాన్ని నేటితరం ప్రేక్షకులకు కొత్తగా చూపించాలంటే విజువల్ ఎఫెక్టులు కావాలి. ముఖ్యంగా ఇప్పటి పిల్లలు రామాయణ గాథ తెలుసుకోవాలి’ అని చెప్పింది.

- Advertisement -

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు