బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన నటి కృతిసనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనొక్కడినే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఈ సినిమా హిట్ కాకపోవటంతో తెలుగులో సరైన అవకాశాలు లభించలేదు. దీంతో ఈ అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితం అయింది. బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.
ఇక ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేసేంత జోరు మీదుంది ఈ బాలీవుడ్ భామ కృతి. ఇటివలె వరుణ్ ధావన్ తో కలిసి ‘బేడియా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ నాయిక, ప్రస్తుతం ‘షెహజాదా, గణపథ్’ చిత్రాల వరుస రిలీజ్ లతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నది. ఆమె కెరీర్ లో మరో ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కుతున్నది ఆది పురుష్. ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 16న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించారు.
రామాయణ ఇతిహాస నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాఘవుడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్ కనిపించనున్నారు. ఈ చిత్రంలోని విజువల్ ఎఫెక్ట్ లపై తాజాగా కృతి స్పందించింది. ఆమె మాట్లాడుతూ, ‘చదివిన దానికంటే చూసి తెలుసుకున్నవే ఎక్కువ గుర్తుంటాయి. ఈ విజువల్ మెమోరీ మరింత అందంగా ఉండాలంటే సినిమా ఒక మ్యాజిక్ ల అనిపించా.లి రామాయణం మనకు ఎప్పటినుంచో తెలిసిన కథ. అయితే దాన్ని నేటితరం ప్రేక్షకులకు కొత్తగా చూపించాలంటే విజువల్ ఎఫెక్టులు కావాలి. ముఖ్యంగా ఇప్పటి పిల్లలు రామాయణ గాథ తెలుసుకోవాలి’ అని చెప్పింది.
For More Updates :
Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News