Naga Chaitanya : ‘విసుగు చెందాను’

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య – సమంత దాదాపు ఏడు సంవత్సరాలు ప్రేమించుకుని పెళ్లి బంధంతో ఒకటయ్యారు. 2017లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడిపిన ఈ జంట ఉన్నట్టుండి విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించడంతో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. నిజానికి సమంత “ది ఫ్యామిలీ మెన్” వెబ్ సిరీస్ లో బోల్డ్ పాత్రలో నటించడం వల్లే విడాకులకు కారణం అయ్యింది అంటూ ఇలా ఎన్నో వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం వీరు ఎవరి లైఫ్ లో వాళ్లు బిజీ అయినప్పటికీ వీరిద్దరిపై ఏదో ఒక న్యూస్ హైలైట్ అవుతూనే ఉంటుంది. అయితే నాగచైతన్య – సమంత ఎందుకు విడాకులు తీసుకున్నారు ఈ ప్రశ్నకు ఇప్పటికీ సరైనా సమాధానం తెలియదు. తెలుసుకోవాలని ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు.

ప్రస్తుతం చైతు “లాల్ సింగ్ చద్ధా” సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో చైతు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా ఇటీవల పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు నాగచైతన్య. ఈ క్రమంలోనే ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ సమంతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చైతు. విడాకుల తర్వాత మీరిద్దరూ ఎప్పుడు వార్తల్లో ఉంటున్నారని ఇంటర్వ్యూలో అడగగా.. “మేమిద్దరం విడాకుల గురించి ప్రకటించాం. మాకు ఒకరిపై ఒకరికి అమితమైన గౌరవం ఉంది. సమంతపై గౌరవం ఎప్పటికీ పోదు. మా మధ్య ఏం జరిగిందో చెప్పాం. మా గురించి చెప్పాలంటే అంతే. కానీ అంతకుమించి మా మధ్యలో ఏదో జరిగిందని అనుకుంటున్నారు. మా గురించి వస్తున్న వార్తలు చూసి విసుగు చెందాను” అంటూ చెప్పుకోచ్చారు నాగచైతన్య. ఈ వ్యాఖ్యలతో మరోసారి చైతన్య-సమంత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు