Adipurush : గాంభీర్యంగా..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ చిత్రాలు చేస్తున్న సంగతి విధితమే. అందులో ఆది పురుష్ ఒకటి. భారతదేశంలో అత్యంత ఖరీదైన సినిమాల్లో ఒకటిగా ఆది పురుష్ తెరకెక్కుతుంది. రూ. 500 కోట్ల బడ్జెట్ తో వస్తున్న భారీ ప్రాజెక్ట్ ఆది పురుష్. దీనికి బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. రాముడి పాత్రలో ప్రభాస్ చేస్తుండగా, సీతగా కృతి సనన్, రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.

ఇటీవల ఆది పురుష్ టీజర్ విడుదలైంది. అయితే ఈ టీజర్ ఫ్యాన్స్ నిరాశపరిచింది. అంత భారీ బడ్జెట్ తో యానిమేషన్ సినిమా చేశారా అంటూ ఫ్యాన్స్ చిత్ర యూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీనిపై ఆది పురుష్ యూనిట్ స్పందించి, 2డీలో కంటే 3డీలో చూస్తే బాగుంటుందని, ఆది పురుష్ ను 3డీ వర్షన్ కోసమే చేశామని వివరించారు. అలాగే కొంత మంది మీడియా ప్రతినిధులకు, ఫ్యాన్స్ కు 3డీ టీజర్ ను కూడా చూపించారు. అప్పటి నుంచి ఆది పురుష్ టీజర్ కు పాజిటివ్ టాక్ వచ్చింది.

తాజాగా ఈ రోజు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో యానిమేషన్ తో ఉన్న ప్రభాస్ గాంభీర్యంగా కనిపిస్తున్నాడు. వెనుక కొతుల దండు ఉంది. ఈ పోస్టర్.. ను చూస్తే సినిమాలోని రామ సేతు నిర్మాణం తర్వాత లంకకు బయలు దెరుతున్న సమయంలోనిది అని తెలుస్తుంది. పోస్టర్ లో రామ సేతు కూడా కినిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు