Aadi SaiKumar : ‘టాప్ గేర్’ లో వచ్చేస్తున్నాడు.

తెలుగు ఇండస్ట్రీ లో హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్ళిపోతున్న హీరో ఆది సాయికుమార్. ‘ప్రేమ కావాలి’ చిత్రంతో హీరోగా పరిచయమైన ఆది, తన నటనతో ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. కథల పరంగా ఎన్నో ప్రయోగాలు చేస్తున్న ఈ యంగ్ హీరో ఆడియన్స్ ని మాత్రం మెప్పించలేకపోతున్నాడు. విరామం లేకుండా సినిమాలు చేస్తున్న ఆయన ఇప్పుడు ‘టాప్ గేర్’ అంటూ మరో యాక్షన్ థ్రిల్లర్ సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యాడు.

శాండిలీవూడ్ లో ‘IPC సెక్షన్ 300’ సినిమా చేసిన డైరెక్టర్ శశికాంత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆది సాయికుమార్ కి జంటగా ‘మజ్ను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన రియా సుమన్ నటిస్తోంది. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

హిట్ చిత్రాల దర్శకుడు మారుతి ఈ టీజర్ ను విడుదల చేశారు. ఒక నిమిషం 21 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ లోని డైలాగ్స్, సన్నివేశాలు సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. టాప్ గేరేసి కారులో ఆది సాయి కుమార్ దూసుకుపోవడం, ఆయన్ను వెంబడిస్తున్న పోలీసులు, మధ్యలో ఫోన్ కాల్స్ సినిమాలో ఉన్న వైవిధ్యాన్ని బయటపెడుతున్నాయి. ఈ టీజర్ లో విజువల్స్ మేజర్ హైలైట్ కాగా.. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

- Advertisement -

చిత్రంలో ఎన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని ఈ టీజర్ స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబరు 30వ తేదీన విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేసారు. ఈ సినిమాతో అయిన ఆది హిట్ కొడతాడో లేదో తెలియాలంటే డిసెంబర్ 30 వరకు వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు