Adavi Sesh: సీక్వెల్ సిద్ధం.

స్వయం కృషి తో ఇండస్ట్రీ లో సక్సెస్ సాధించిన హీరోలలో అడవి శేష్ ఒకడు. తన విభిన్నమైన పాత్రల ద్వారా, సినిమాల ద్వారా ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటూ, తన స్టోరీ సెలక్షన్ తో భారీ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఇక తను నటించిన గూఢచారి సినిమా తన కెరీర్ కు ఒక టర్నింగ్ పాయింట్ అయింది.

రీసెంట్ గా ”మేజర్” తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న శేష్ ఇప్పుడు ”హిట్ 2” అనే సినిమాతో మళ్ళీ ఇంకొక బ్లాక్ బస్టర్ ని తన ఖాతా లో వేసుకున్నాడు. ఇది ఇలా ఉండగా, తన గూఢచారి సినిమా కి సీక్వల్ గా తెస్తున్న సినిమాని ‘జి 2’ అనే టైటిల్ తో అధికారక ప్రకటన ఇచ్చారు.
జి2 కి సంబంధించిన ‘ప్రీ విజన్ ‘ వీడియో ని ముంబై లో మరియు ఢిల్లీ ఒకే సమయానికి జనవరి 9న రిలీజ్ చేయబోతున్నారు.

ఈ సినిమా స్టోరీను శేష్ స్వయంగా రాసారు, మేజర్ సినిమా కి ఎడిటర్ గా పని చేసిన ‘వినయ్ కుమార్ సిరిగినీది’ డైరెక్టర్ గ తన డెబ్యూ ని ఈ చిత్రం తో చేయనున్నారు.ఈ సినిమా ను పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా చేసేందుకు ‘టి జి విశ్వ ప్రసాద్’ మరియు ‘ అభిషేక్ అగర్వాల్’ కలిసి ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ మరియు ‘ఏ కె ఎంటర్టైన్మెంట్స్’ అనే మూడు బ్యానర్ల పేరట ప్రొడ్యూస్ చేయబోతున్నారు.

- Advertisement -

గతం లో ఈ కాంబినేషన్స్ లో వచ్చిన కాశ్మీరీ ఫైల్స్, మేజర్, కార్తికేయ 2 తిరుగు లేని విజయాన్నీ సాధించిన విషయం మన అందరికి తెలిసిందే. మేకర్స్ ఇప్పటికే అడవి శేష్ బ్లాక్ సూట్ లో ఒక మెషిన్ గన్ ని పట్టుకొని, యాక్షన్ కు సిద్ధంగా ఉన్నట్టుగా ఒక కాన్సెప్ట్ పోస్టర్ ని రిలీజ్ చేసారు.

ఇక పోతే, గూఢచారి సినిమా అంతా ఇండియా లోనే ఉండగా, జి 2 మాత్రం విదేశాలలో ఉండబోతుందని , గూఢచారి ఎక్కడ అయితే ఆగిందో, అక్కడ నుంచి మొడాలు పెడుతున్నారు అని సమాచారం. అంటే మౌంటెన్ ఆల్ప్స్ నుంచి స్టోరీ మొదలవ్వబోతుండచ్చు. మేకర్స్ ఈసారి అన్ని యాక్షన్ సినిమాలకంటే డబల్ గా యాక్షన్ తో ఉన్న స్టార్ కాస్ట్ తో నే చిత్రికరించాలని నిర్ణయించారు.

ఈ సినిమా తన స్టోరీ తోను , టెక్నికల్ స్టాండర్డ్స్ లోను, తెలుగు సినిమా చరిత్ర లో నే ఒక కొత్త అధ్యాయం గా మారనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అభిమానులు అందరూ జనవరి 9న ‘జి2’ ప్రీ విజన్ పోస్టర్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు