Adipurush: రాముడి అవతారం అదరహో

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న ‘ఆది పురుష్’ మూవీ అప్డేట్ వచ్చేసింది. సాహో, ‘రాదే శ్యామ్’ వంటి వరుస ప్లాపుల తర్వాత ప్రభాస్ ‘ఆది పురుష్’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇక ఇదిలా ఉంటే షూటింగ్ పూర్తయి నెలలు గడుస్తున్నా సినిమాకు సంబంధించి ఒక్క అప్డేట్ కూడా ఇప్పటివరకు రాలేదు. దాంతో డార్లింగ్ అభిమానులు చిత్ర బృందంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ ప్రకటించారు.

తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ పోస్టర్ లో ప్రభాస్ విల్లు ఆకాశానికి ఎక్కుపెట్టి కనిపించారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. ఈ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా టైటిల్ కింద చెడు పై మంచి సాధించిన విజయం అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక ‘ఆది పురుష్’ టీజర్ లాంచ్ వేడుకకు ప్రభాస్, కృతి సనన్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. కాగా దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. రామాయణం, ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీతగా కృతి సనన్, లంకేష్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు