Adivi Sesh : నెక్ట్స్ కూడా పాన్ ఇండియా

కెరీర్ ప్రారంభంలో సైడ్ క్యారెక్టర్స్ కూడా రాలేవు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ హీరో. అతనేవరో కాదు.. అడివి శేష్. దొంగాట వరకు కామెడీ జానర్ లో ప్రయాణించిన ఈ యంగ్ ఇప్పుడు మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ సినిమాలనే చేస్తున్నాడు. తన స్క్రిన్ ప్లే లో వచ్చిన క్షణం నుంచి అడివి శేష్ కెరీర్ మారిపోయింది. అక్కడి నుంచే తన పెన్ కు పని చెబుతూ వరుసగా థ్రిల్లర్, ఇన్వేస్టిగేషన్ సినిమాలనే చేస్తున్నాడు.

తాజాగా అడివి శేష్ హిట్ 2లో నటిస్తున్న విషయం తెలిసిందే. కాసేపటి క్రితం ట్రైలర్ కూడా విడుదలైంది. దీనిలో అడివి శేష్ తన మార్క్ నటన కనిపించింది. శైలేష్ కొలన్ కథ సినిమా ఒక హైలైట్ అని చెబితే.. మరొకరి గురించి చర్చించుకోవాల్సి వస్తే.. అది అడివి శేష్ గురించి మాత్రమే. ఇదిలా ఉండగా ఈ యంగ్ హీరో చేతిలో ఇప్పుడు రాబోయే సినిమాలు కూడా థ్రిల్లర్ జానర్ కు చెందినవే.

ఇప్పటికే గూఢచారి 2 కోసం సర్వం సిద్ధం చేశాడు. దీని కోసం స్వయంగా కథ, స్క్రీన్ ప్లేను కూడా అందిస్తున్నాడు. ఇది త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా హిట్ 2 ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో మరో అసక్తిరమైన అనౌన్స్ చేశాడు. తన తర్వాత ప్రాజెక్ట్ అన్నపూర్ణ స్టూడియోస్ తో ఉంటుందని వెల్లడించాడు. ఇది కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చాడు. తమ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయడానికి అక్కినేని నాగ చైతన్య, అఖిల్ చాలా ఆసక్తిగా ఉన్నారని చెప్పుకొచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు